VeeraSimha Reddy: వీరసింహారెడ్డి ఫ్యాన్స్ కు శుభవార్త.. ఆ సీన్లు ఉంటాయట!

VeeraSimha Reddy: సినీ నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు నందమూరి నటసింహం బాలయ్య. విశ్వనటుడు నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగారు. కెరీర్ పీక్స్ ఉన్నప్పుడు బాలయ్య నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వరుసగా 9 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో బాలయ్య కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నారు. అప్పుడే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సింహా’ సినిమా చేశారు. ఈ సినిమా ఇండస్ట్రీయల్ హిట్ కొట్టింది. దీంతో బాలయ్య మళ్లీ తన ఫామ్‌ను పొందారు. ఆ తర్వాత ‘లెజెండ్, లయన్, పైసా వసూల్’ సినిమాలు కమర్షియల్ హిట్ అందుకున్నారు. గతేడాది విడుదలైన ‘అఖండ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలయ్య తన ఉగ్ర రూపాన్ని చూపించారు.

 

 

ఆహా సమర్పణలోని అన్‌స్టాపబుల్ టాక్‌ షోకు వ్యాఖ్యాతగా బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. అప్పటివరకు బాలయ్య మాస్ యాంగిల్‌ను చూసిన ప్రేక్షకులు.. బాలయ్యలోని తనలోని చిలిపి, అల్లరిని పరిచయం చేశారు. ఈ షో ఫస్ట్ సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మధ్య సీజన్-2 కూడా స్టార్ట్ అయి.. కొన్ని ఎపిసోడ్‌లు కూడా పూర్తి చేసుకుంది. రాజకీయ నాయకులు, యంగ్ హీరోలు వచ్చారు. ఈ ఎపిసోడ్‌లు కూడా భారీ విజయాన్నే అందుకున్నాయి. మొదటి కంటే బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలొయింగ్ మరింతగా పెరిగింది. బాలయ్య సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.

 

ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ ప్రేక్షకులను మరింతగా ఆసక్తి పెంచుతోంది. అదేంటంటే.. వీరసింహారెడ్డి సినిమాలో 25 నిమిషాల పాటు యాక్షన్ సీన్లు ఉంటాయట.. ఈ సీన్లు నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయని, 25 నిమిషాలపాటు బాలయ్య శివతాండవం చూపిస్తాడని సమాచారం. ఈ యాక్షన్ సీన్స్ చూసి ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా చూడాలని అభిమానుల్లో ఎక్సైట్‌మెంట్ మరింతగా పెరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -