Balayya: బాలయ్య కాల్పులు వెనకాల ఉన్నది ఎన్టీఆర్ అన్న లక్ష్మీపార్వతి…

Balayya: నందమూరి బాలకృష్ణ… జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య గత కొద్దికొద్ది రోజులుగా దూరం ఉంది అనే వార్త తెలిసిందే. ఇది అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంది. అయితే తాజాగా ఈ విషయం మరోసారి స్పష్టమైనది. గురువారం స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తానికి విచ్చేశారు….!

 

అయితే ఈరోజు తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారు. ఆ సమయంలో అక్కడికి ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున విచ్చేసి ఎన్టీఆర్ కటౌట్లు ఏర్పాటు చేసి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం వాటిని పట్టించుకోకుండా వచ్చిన పని చూసుకుని వెళ్లిపోయారు.

తర్వాత కొద్దిసేపటికి అక్కడికి నందమూరి బాలకృష్ణ వారి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. అక్కడ ఎన్టీఆర్ కటౌట్లు ఉండడం చూసి వెంటనే సిబ్బందితో కట్ అవుట్ లు తీసేయమని చెప్పారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఎన్టీఆర్ కటౌట్లు తొలగించారు. అయితే ఈ విషయం పైన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందించారు… ఇంట్లో నుంచి గెంటి వేసినట్లుగానే ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో ప్రవర్తిస్తున్నారని… సీనియర్ ఎన్టీఆర్ కి అసలైన వారసులు ఈ జూనియర్ ఎన్టీఆర్ అని లక్ష్మి పార్వతి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తమకి ప్రాధాన్యత లేకుండా పోతుందనే అతని దూరం పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ గతంలో బాలయ్య బెల్లంకొండ సురేష్ పై చేసిన కాలపులు విషయం గురించి మాట్లాడారు. అప్పట్లో బాలయ్య సినిమా థియేటర్ నుండి తీసేసి ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాని ప్రదర్శించినందుకే బాలయ్య కాల్పులు చేశారని చెప్పారు. బాలయ్యకు ఆ స్థాయిలో ఆక్రోశం పెరిగిపోయిందని ఎన్టీఆర్ పై ఉన్న కోపంతోటే ఆనాడు అలా చేశారని చెప్పారు. అసలు లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలకి బాలయ్యకి సంబంధం ఏంటి అంటూ నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -