Balayya: బాలయ్యపై పోటీ చేసేది ఎవరో తెలుసా.. హిందూపూర్ లో వైసీపీ అంటూ?

Balayya: నందమూరి హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై వైసీపీ కాస్త ఫోకస్ పెట్టింది. బాలయ్య బాబు హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉండగా ఆయనకు పోటీగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేశారు. వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా తాజాగా హిందూపురం పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటించారు.

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని, హిందూపురం పార్లమెంటు నుంచి బోయ వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారని పెద్దిరెడ్డి వెల్లడించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకే చోట గతంలో ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును హిందూపురంలో బాలకృష్ణను ఖచ్చితంగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

టిక్కెట్ల కేటాయింపులో ఉన్న కొంత అసంతృప్తిని త్వరలోనే అధిగమిస్తాం అన్నారు. టీడీపీ, జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటి దాకా స్పష్టత లేదని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ తప్ప ఆ పార్టీలో పోటీ చేసే వారు ఎవరు ఉన్నారు? అని ప్రశ్నించారు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఓట్లు చీలేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలు అధిగమిస్తాం అన్నారు. ఎన్నికల్లో సచివాలయ సిబ్బందిని ఉపయోగించటం లేదు అని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అవగాహన లేక ఈసీకి ఫిర్యాదు చేశారని సెటైర్లు వేశారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడే అంటూ మండిపడ్డారు పెద్దిరెడ్డి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -