Gudivada Amarnath: నీ భార్యతో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇంట్లో చూసుకో.. లోకేష్‌పై మంత్రి ఫైర్

Gudivada Amarnath: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. లోకేష్‌కు, ఆయన భార్య బ్రహ్మణికి మధ్య ఏవైనా గొడవలు ఉంటే ఇంట్లో మాట్లాడుకొని తేల్చుకోవాలని దుయ్యబట్టారు.

బ్రహ్మణిని తిట్టలేక తమతో తిట్టించాలనే తాపత్రయం లోకేష్‌లో కనిపించిందని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్ భారతి రాజకీయాల్లో ఏ రోజైనా బయట కనబడ్డారా అని నిలదీశారు. ఏ రోజైనా రాజకీయంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అని లోకేష్‌ను కడిగి పారేశారు.

అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జనసేనపై కాపుల పార్టీ అని ముద్రవేస్తున్నారని అన్నారు.. అయితే అది కాపు జనసేన కాదని కౌంటర్లు వేశారు. పవన్ కల్యాణ్‌ నడుపుతుంది కాపు జనసేన కాదని.. కమ్మ జనసేన అని విమర్శించారు. అక్కడ డైరెక్షన్‌ చేస్తుంది నాదెండ్ల మనోహర్ అని కౌంటర్లు వేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -