Volunteer: ఏపీలో అధికారం మారితే వాలంటీర్ వ్యవస్థకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?

Volunteer: ఏపీ సీఎం జగన్ మరి ఇతర రాష్ట్రంలో లేని వాలంటరీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అసలు వాలంటరీ వ్యవస్థ అంటే ఏంటి అన్న విషయానికి వస్తే.. ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో నిరుపేదలకు నేరుగా అందడానికి, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మధ్య దళారీ వ్యవస్థలు లేకుండా ప్రతినెలా ఒకటో తేదీని ముంగిట్లోకి అందడానికి చాలా ఉపయోగపడుతున్నది. అయితే ఇదే వాలంటీరు వ్యవస్థ వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూల ప్రచారం నిర్వహిస్తున్నదని, వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి అధికార పార్టీ కుట్ర చేస్తున్నదని విపక్షాలు పదేపదే ఆరోపిస్తున్నాయి.

పవన్ మాదిరిగా ఏమీ తెలియకుండా మాట్లాడేవాళ్లయితే వాలంటీర్ లను ఏకంగా అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులుగా కూడా ప్రచారం చేసేస్తున్నారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వాలంటీరు వ్యవస్థను పూర్తిగా అంతమొందించడానికి విపక్ష పార్టీలు, పచ్చమీడియా ఒక వ్యూహాత్మక ప్రయత్నం చేస్తున్న్టట్టుగా కనిపిస్తోంది. తాజాగా విశాఖపట్టణంలో ఒక వృద్ధురాలి హత్య జరిగింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి షాపు యజమాని ఇంటికి వెళ్లి, యజమాని తల్లిని హత్యచేసి ఆమె మెడలోని బంగారు ఆభరణాలతో పారిపోయాడు.

 

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతడు వచ్చి వెళ్లిన విషయం తెలియడంతో పోలీసులు విచారించినప్పుడు తాను హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. ఆ వెంకటేష్ అనే వ్యక్తి వాలంటీర్ గా విదులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఘటనను ఆధారం చేసుకుని వాలంటీర్లు అందరూ హంతకులు అన్నట్టుగా చిత్రీకరించడానికి, టీడీపీ నానా తంటాలు పడుతోంది. వాలంటీర్లు అంటేనే రకరకాల అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై ఉన్న అనేక నేర ఆరోపణలను ప్రస్తావిస్తూ ఇప్పుడు హత్యలు కూడా చేస్తున్నారంటూ వాలంటీరు వ్యవస్థను తప్పుపడుతున్నారు. అయితే నిజానికి వెంకటేష్ అనే వ్యక్తిని విధులకు సక్రమంగా హాజరు కావడం లేదనే ఫిర్యాదుతో జులై 24న వాలంటీరుగా తొలగించినట్టు జీవీఎంసీ కమిషనర్ ప్రకటించారు. హత్య సంగతి బయటకు వచ్చిన తర్వాతనే.. తొలగించినట్టుగా సమర్థించుకుంటున్నారనేది టీడీపీ ఆరోపణ. అదే నిజమని అనుకున్నప్పటికీ వెంకటేష్ చేసిన నేరాన్ని యావత్ వాలంటీరు వ్యవస్థకు ఆపాదించడం అనేది ఎంతవరకు సబబు అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -