Ecuador: సరదా కోసం వెళితే చివరికి శవాలుగా అలా?

Ecuador: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. సరదాగా విహారయాత్రలకు వెళ్లిన వారు చివరికి శవాలుగా మిగులుతున్నారు. రోడ్డు ప్రమాదాలు అనుకొని ఆ సంఘటనలు జరిగి కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరి ముఖ్యంగా స్నేహితులతో ఫ్యామిలీతో కలిసి కుటుంబ సభ్యులు బీచ్ లు,నదులు పర్యాటక కేంద్రాలకు వెళుతున్న సమయంలో ఊహించిన విధంగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. విహారయాత్రలు కాస్త విషాదయాత్రలుగా మిగులుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

 

సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన ముగ్గురు అమ్మాయిలు చివరికి శవాలుగా కనిపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈక్వెడార్‌లోని క్వినెడే సమీపంలో ఉన్న ఎస్మరాల్డస్ బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు హింసకు గురై, హత్యగావించబడ్డారు. ఏప్రిల్ 5వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఆ ముగ్గురు యువతులు వారికి ఏదో ఆపద జరుగుతుందని ఊహించి తన స్నేహితులకు సందేశాలు పంపించారు. తాము డేంజర్‌లో ఉన్నామని, ఏదో జరగబోతోంది అంటూ మెసేజ్ చేశారు. కానీ అంతలోనే వారు అదృశ్యం కావడం, అంతమైపోవడం జరిగింది.

ఆ మెసేజ్‌లు పంపిన కాసేపటికే దుండగులు ఆ ముగ్గురిని చిత్రహింసలకు గురి చేసి, గొంతు కోసి హతమార్చారు. నదీ ఒడ్డున కొంత గొయ్య తీసి పూడ్చిపెట్టారు. వేటకు వెళ్లిన సమయంలో జాగిలాలు పసిగడట్టంతో వారి మృతదేహాలు వెలుగుచూశాయి. మృతుల వివరాలు ఇలా ఉన్నాయి.. నయేలీ తపియా 22 ఏళ్ల యువతి యులియానా మాసియాస్ 21 ఏళ్ల యువతి, డెనిస్సీ రేనా 19 ఏళ్ళ యువతిగా పోలీసులు గుర్తించారు. కాగా, వీరిలో ఒకరు మోడల్, మరొకరు గాయని, మరొకరు విద్యార్థిని అని పోలీసులు వెల్లడించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ ఏం జరిగింది అన్న విషయానికి వస్తే.. ముగ్గురు యువతులు అక్కడికి వెళ్ళగానే స్క్రీన్ సూట్లు ధరించి బీచ్ లో ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో వారిని ఎవరో వెంబడిచడం గమనించారు. అప్పుడే తాము డేంజర్‌లో ఉన్నామని గ్రహించిన ఆ యువతులు.. వారి స్నేహితులకు బంధువులకు సందేశాలు పంపారు. నయేలి తన సోదరికి.. ఏదో జరదకూడదని జరగబోతోందని భయంగా ఉంది, అందుకే నీకు మెసేజ్ చేశా అని సందేశం పంపింది. సోదరి వెంటనే ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ వచ్చింది. నయేలికి ఆల్రెడీ పెళ్లై, నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది.

కాగా బీచ్ బట్టలు, స్నానపు సూట్లు, తేలికపాటి దుస్తులు, షార్ట్‌లతో మృతదేహాలు కనిపించాయని చెప్పారు. అయితే ఇది మాదక ద్రవ్యాల రవాణా ముఠా పనే అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -