Jakkanna Mohan Babu: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు ఎస్.ఎస్ రాజమౌళి. ఆయన ఇప్పుడు వరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఇకపోతే దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.
ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత చాటి చెప్పారు రాజమౌళి. ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళి కి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే రాజమౌళి మోహన్ బాబు మధ్య గ్యాప్ వచ్చిందట..ఈ వార్త ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా మయదొంగ. 2007లో విడుదల అయిన ఈ సినిమాలో ప్రియమణి, మమతా మోహన్దాస్ హీరోయిన్ లుగా నటించారు.
ఈ సినిమాలో యముడిగా విలక్షణ నటుడు మోహన్బాబు నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సమయంలో రాజమౌళి, మోహన్ బాబు బాగా క్లోజ్ అయ్యారు. ఈ క్రమంలోనే మోహన్బాబు రాజమౌళితో తన పెద్ద కొడుకు విష్ణుతో తన బ్యానర్ లో ఒక సినిమా చేసి పెట్టమని రిక్వెస్ట్ చేశారట.
అప్పటకి విష్ణుకు సరైన హిట్లు లేవు. రాజమౌళితో ఒక్క సినిమా పడితే తన కొడుకు కెరీర్ లేస్తుందని హీరోగా సెటిల్ అవుతాడన్నదే మోహన్బాబు ఆశ. అయితే అందుకు రాజమౌళి ఒప్పుకోలేదట. తాను ఇప్పటికిప్పుడు విష్ణుతో సినిమా చేయలేనని సమయం వచ్చినప్పుడు చేస్తానని చెప్పారట. అయితే మోహన్బాబు మాత్రం ఇప్పుడే విష్ణుతో సినిమా చేయాలని తన కొడుకు ప్లాపుల్లో ఉన్నాడని బలవంతం చేశాడట. అయితే రాజమౌళి మాత్రం కుదరదని ఖరాఖండీగా చెప్పేశాడట. మీరు బలవంత పెడితే సినిమా తీసేస్తాను. రిజల్ట్ నా చేతుల్లో లేదని చెప్పడంతో మోహన్బాబు బాగా హర్ట్ అయ్యారట. నా మాట ఇండస్ట్రీలో ఎవ్వరూ కాదనరు. నేను ఒక్క సినిమా చేసి పెట్టమని అడిగితే రాజమౌళి ఇలా అంటాడా ? అని ఇండస్ట్రీలో తన సన్నిహితలతో చెప్పుకుని మోహన్బాబు వాపోయాడని అంటారు. ఆ తర్వాత వీరి మధ్య అంత సఖ్యత లేదట.