Lakshmi Devi: ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎంత కష్టపడినా కూడా రూపాయి కూడా మిగలకపోగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు. అటువంటప్పుడు కొన్ని రకాల చిట్కాలు పాటించడం తప్పనిసరి. పురాతన కాలం నుంచి కొన్ని రకాల పద్ధతులను పాటిస్తున్నారు. వాటిని పాటించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు. అప్పుల బాధలు కూడా తగ్గుతాయి. లక్ష్మీ దేవికి రోజూ నేతితో దీపం పెడితే డబ్బులు వస్తాయి.
అప్పుల బాధల నుండి బయటపడవచ్చు. పీచు తీసిన కొబ్బరికాయ మీద కుంకుమ పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి నీటిలో దానిని జార విడవండి. మీరు అనుకున్న కోరిక అప్పుడు తీరుతుంది. ఉదయం లేవగానే రెండు అరచేతులను దగ్గరగా చేసి, అందులోకి చూస్తే విష్ణు, లక్ష్మీదేవిల అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. ప్రతి బుధవారం రెండు ఖాళీ కుండల్ని చిన్నవి తీసుకుని, ముద్ద కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయాలి. ఈ విధంగా ఆరు వారాలపాటు చేస్తే చాలా మంచిది. ప్రతి బుధవారం కూడా పాలతో చేసిన పరమానాన్ని లక్ష్మీదేవికి పెడితే ఎంతో మంచిది.
ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు. ఇంట్లో సాయంత్రం పూట సాంబ్రాణి వేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పసుపు వత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టి, కనకధార స్తోత్రాన్ని చదివితే కూడా ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు. ఇలా అప్పుల బాధలని తీర్చుకోవచ్చు. చీమలకి చక్కెర వేస్తూ ఉండడం వలన కూడా ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు.