Rashmika Mandanna: హీరోయిన్ కావడమే నేను చేసిన పాపమా.. రష్మిక కామెంట్స్ వైరల్!

Rashmika Mandanna: నేషనల్ క్రష్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది రష్మిక. టాలీవుడ్ లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి నేషనల్ క్రష్ గా మారిపోయింది.

 

ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల యానిమల్ సినిమాతో మరొక సాలిడ్ హిట్ అందుకుంది రష్మిక. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వాళ్లను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.

తాజాగా ఆ సంఘటన గురించి రష్మిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువ అవుతున్నాయి దీని గురించి ప్రశ్నిస్తే ఇవన్నీ కోరుకునే కదా మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు అని అంటున్నారు అని తెలిపింది. ఇతర అమ్మాయిలకు ఇలాంటివి జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు అమ్మాయిలు పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అని తెలిపింది రష్మిక.

 

ఇప్పుడు తనలాంటి వాళ్లు డీప్ ఫేక్ గురించి మాట్లాడితేనే చాలామంది మహిళలకు దీని గురించి అవగాహన కలుగుతుంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది రష్మిక. ఏఐ అనే టెక్నాలజీ తో హీరోయిన్ ల నకిలీ ముఖాలను రూపొందించి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం ఇప్పుడు పరిపాటి అయిపోయింది. ఈ సమస్య కేవలం రష్మిక తోనే మొదలవలేదు అంతకుముందు కాజోల్, కత్రినా కైఫ్, అభిరామి వంటి ప్రముఖ తారలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న వారే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -