Rashmika Mandanna: సౌందర్య విషయంలో రష్మికను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఏమైందంటే?

Rashmika Mandanna: ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తున్న నటి రష్మిక మందన్న కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇప్పుడు నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది. యానిమల్ సినిమాలో ఆమె నటన చూసిన ప్రతి సినీ అభిమాని ఆమె నటనకు ఫిదా అయిపోయారు. ఈ నేషనల్ క్రష్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ కన్నడ భామ.

 

ప్రస్తుతం పుష్ప2 షూటింగ్స్ లో బిజీగా ఉంది. అయితే ఈమధ్య ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దివంగత నటి సౌందర్య గురించి తన మనసులో మాట బయట పెట్టింది. తనకు సౌందర్య అంటే చాలా ఇష్టం అని,తనకు సౌందర్య బయోపిక్ లో నటించాలని ఆశగా ఉంది.

తను చిన్నతనంలో తన తండ్రి సౌందర్య లా ఉన్నావు అని మెచ్చుకునేవారు. సౌందర్య లైఫ్ జర్నీ గురించి కూడా తన తండ్రి తనతో చెప్తూ ఉండేవారని అవకాశం వస్తే ఖచ్చితంగా సౌందర్య బయోపిక్ లో నటిస్తానని పేర్కొంది. అయితే ఈ మాటలను కొందరు సమర్థిస్తుంటే కొందరు నెటిజన్స్ మాత్రం ఆమెను తీవ్రంగా ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు. రష్మిక సౌందర్య ను ఏక వచనం తో పిలవడం కరెక్ట్ కాదు, అయినా సౌందర్య అంటావేంటి సౌందర్య గారు అని పిలవాలి.

 

ఆమె ఒక లెజెండ్, ఆమె పేరు కూడా పలికే అర్హత నీకు లేదు అంటూ చాలా ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఇక దీనిపై రష్మిక ఏ విధంగా స్పందిస్తుంది అన్నది వేచి చూడాలి. ఇక రష్మిక కెరియర్ విషయానికి వస్తే బాలీవుడ్ లో యానిమల్ సినిమా హిట్ అవ్వటంతో అమ్మడికి అక్కడ డిమాండ్ బాగా పెరిగింది. గ్లామరస్ రోల్ తో ఆకట్టుకున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో ఛవా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రష్మిక కి ఇది 22వ చిత్రం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -