Rashmika Mandanna: మేనేజర్ తో అందుకే విడిపోయా.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక!

Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్,బాలీవుడ్ అని భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఒకవైపు సినిమాలు నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది రష్మిక. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా రష్మికకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

 

కొంతకాలంగా ఆమె దగ్గర నమ్మకంగా పనిచేసిన ఒక మేనేజర్ తప్పుకున్నాడని ఆమెను మోసం చేశాడని అందుకే ఆమె పనిలో నుంచి తీసేసిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రష్మికకు తెలియకుండా, ఆమె మేనేజర్ చిన్న స్కామ్ చేశాడట. దాదాపు 70-80 లక్షల రూపాయలను స్కామ్ చేశాడంటూ వార్తలు మారుమోగుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై రష్మిక మందన స్పందించింది. ఇప్పటివరకు వచ్చిన అన్ని రకాల ఊహాగానాల్ని ఆమె ఖండించింది. మేనేజర్ తాను విడిపోవడం వెనక ఎలాంటి గొడవలు జరగలేదని రష్మిక తాజాగా తెలిపింది. ఇన్నాళ్లూ ఆరోగ్యకర వాతావరణంలో పనిచేశాము.

పరస్పర ఒప్పందంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఆమె వెల్లడించింది. ఇన్నాళ్లూ తామిద్దరం ప్రొఫెషనల్ గా పనిచేశామని, ఇకపై కూడా విడివిడిగా అంతే హుందాగా పనిచేస్తామని రష్మిక చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన మాజీ మేనేజర్ తో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసింది రష్మిక. ఇకపోతే రేష్మిక మందన ఆ ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ సినిమాలో ఈమెకు సంబంధించిన సన్నివేశాలు అన్నీ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -