Akkineni: అక్కినేని ఫ్యామిలీలో చైతన్య, అఖిల్ పెళ్లిళ్లు జరిగేది అప్పుడేనా?

Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీలో తిరుగులేని నటుడుగా గుర్తింపు పొందారు. ఇక ఈయన వారసులుగా నాగర్జున ఇండస్ట్రీకి వచ్చారు అనంతరం ఈయన వారసులు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ వీరి వైవాహిక జీవితాలలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని చెప్పాలి.


నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే ఈయన మొదట దగ్గుబాటి లక్ష్మి వివాహం చేసుకొని నాగచైతన్య జన్మించిన తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు అనంతరం నాగార్జున నటి అమలను పెళ్లి చేసుకొని అఖిల్ కి జన్మనిచ్చారు.ఇక నాగార్జున వారసుడు నాగచైతన్య నటి సమంతను పెళ్లి చేసుకొని మూడేళ్లు కూడా గడవకముందే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అఖిల్ నిశ్చితార్థం జరిగిన అనంతరం ఆయన నిశ్చితార్థం అక్కడికి ఆగిపోయింది.

ఇలా నాగార్జున కొడుకులు మాత్రమే కాకుండా ఆయన మేనల్లుడు సుమంత్ సైతం నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకొని విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా గడుపుతున్నారు. ఇక తన మేనకోడలు సుప్రియ కూడా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా అక్కినేని కుటుంబంలో విడాకుల తీసుకొని విడిపోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే నాగార్జున త్వరలోనే తమ పిల్లలకు మంచి జీవితాన్ని అందించాలని భావిస్తున్నారట.

ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో అఖిల్ కి పెళ్లి చేయబోతున్నట్లు సమాచారం అలాగే నాగచైతన్యకు కూడా తనకు ఏ అమ్మాయి నచ్చుతుందో తనతో పెళ్లి చేయడానికి నాగార్జున సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఒక హీరోయిన్ ప్రేమలో నాగచైతన్య ఉన్నాడని,తనని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇక తన మేనకోడలు సుప్రియ కూడా హీరో అడివి శేష్ తోప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో కొన్ని నెలల వ్యవధిలోనే ఈ ముగ్గురికి పెళ్లిళ్లు కాబోతున్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -