Samantha: ఆ పిచ్చి వల్లే సమంత ఈ విధంగా చేస్తోందా?

Samantha: గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ సమంత దూరంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం ఆమె మళ్లీ యాక్టీవ్ అవుతోంది. తనదైన స్టైల్ లో సమంత కౌంటర్స్ వేస్తూ సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పలు పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ను పలకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో సమంతపై మళ్ళీ హ్యుజ్ నెగిటివిటీ స్టార్ట్ అయ్యిందని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సమంత పాపులారిటీని సంపాదించుకుంది. తాజాగా యశోద సినిమాతో ఆమె మరో విజయాన్ని అందుకుంది.

 

యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు తెలిపింది. అదే సినిమా విజయవంతం అవ్వడానికి కూడా కారణం అయ్యిందని చెప్పొచ్చు. కాగా మరోసారి అలాంటి స్ట్రాటజీతోనే సమంత రంగంలోకి దిగినట్లు అనిపిస్తోంది. త్వరలోనే ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదల కానుంది. అంతేకాకుండా ఆమె నటిస్తున్న ఖుషీ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది.

 

ఇలాంటి సమయంలోనే సమంత పబ్లిసిటీ, పాపులారిటీ కోసం మళ్లీ జనాలతో కనెక్ట్ అవుతోంది. అందుకే సోషల్ మీడియాలో తన పోస్టులతో మెరుస్తోంది. అంతేకాకుండా మొదటి నుంచి సమంతకి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా ఉందని, దానికోసమే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగచైతన్యని పెళ్లి చేసుకొని ఆ పాపులారిటిని డబుల్ చేసుకోగా ఆమెను ఆ సినిమా చేయొద్దని అనడంతోనే విడాకులు కూడా తీసుకున్నట్లు సమాచారం.

 

ఏదేమైనా సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకుని ఏడాదిపైనే అయినా ఇంకా ఈ జంటపై రూమర్స్ ఆగడం లేదు. నాగచైతన్య, సమంత విడిపోవడం జనాలకు కూడా అంతగా ఇష్టం లేదు. అయినప్పటికీ వీరి గురించి ఏదోక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సమంత కూడా ఇకపై నెట్టింట తన పోస్టులతో సందడి చేయనుంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -