Chandrababu: చంద్రబాబు ఏం చేస్తాడో అనే భయం పవన్ ను వెంటాడుతోందా.. ఏం జరిగిందంటే?

Chandrababu: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కూడా మహా జోరుగా సాగుతోంది. తాజాగా పవన్ టీడీపీ నేత చంద్రబాబుతో భేటీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ఒంటరిగా తిరుగుతున్నప్పటికీ ఆయనకి సీఎం పదవిపై ఆశ లేకపోవడం గమనార్హం.

ఆయన ఏకైక లక్ష్యం వైసీపీ ని గద్దె దించడం. అయితే పవన్ లో ఒక భయం వెంటాడుతున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా వాడుకుని వదిలేస్తారని సంగతి అందరికీ తెలిసిందే. వీలైతే వెన్నుపోటు కూడా పొడవడానికి వెనకాడరు. అలాంటి బాబు జనసేనతో పొత్తు పెట్టుకుంటాను అని ఎక్కడా చెప్పకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆలోచనలన్నీ చంద్రబాబు నాయుడు చుట్టూనే తిరుగుతున్నాయని..

 

చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో అనే భయం ఆయనని వెంటాడుతుందని రాజకీయ వర్గాల సమాచారం. నిజానికి పవన్ తో పొత్తు పెట్టుకోవడం అనేది చంద్రబాబునాయుడుకే ఎక్కువ అవసరం. ఎందుకంటే 2024లో తను సీఎం అయితే తప్ప అటు టీడీపీ కి గాని ఇటు లోకేష్ కి గాని రాజకీయ భవిష్యత్తు లేదని చంద్రబాబు నాయుడు కి బాగా తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ కి సీఎం అవ్వాలనే ఆలోచన లేకపోవడంతో సంబరపడుతున్నాడు చంద్రబాబు నాయుడు.

 

పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ము చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ని బాగా వాడుకుంటున్నట్లు జనసేన పార్టీలోనే అంతర్గత చర్చ జరుగుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఎక్కడ పొత్తుల గురించి మాట్లాడటం లేదు. తనకు తానుగా పొత్తులపై పదేపదే పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండటంతో ఎన్నికల ముంగిట జనసేనకు ఎన్నో కొన్ని కేటాయించి చంద్రబాబు చేతులు దులుపుకుంటాడా.. లేక పవన్ కళ్యాణ్ ఆశించిన సీట్లు ఇచ్చి అతనిని తృప్తి పరుస్తాడా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -