NTR31: దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ తో సాలార్ తెరకెక్కించగా, అది డిసెంబర్ ఆఖరి వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ 31 తెరకెక్కించబోతున్నారు. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే దేవర సినిమా షూటింగ్ లో తెగ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మొదటి పార్ట్ వచ్చేయడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో తీయబోయే సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టు పై ప్రేక్షకులలో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో మరొక వార్త బయటకి వచ్చింది. ప్రశాంత్ నీల్ డిసెంబర్ నాలుగో వారం తర్వాత సాలార్ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకొని ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రాబోతున్నాడు.
కాబట్టి జనవరి ఎండింగ్ నుంచి ఎన్టీఆర్ తో తాను చేయబోయే సినిమాని ప్రశాంత్ నేను స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది. 2025 సమ్మర్ టార్గెట్ గా తన సినిమాను రిలీజ్ చేయాలనేది హీరో, డైరెక్టర్ల ప్లాన్. అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో ప్రియాంక చోప్రా నటించబోతుంది అంటూ రూమర్లు వచ్చాయి అయితే అది ఎంతవరకు నిజం అనేది తెలియదు.
అసలు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే ఏదో ఒక రూమర్ ఈ సినిమా గురించి వస్తూనే ఉంది.అయితే అఫీషియల్ గా సినిమా గురించి అనౌన్స్ చేసే వరకు ఎన్టీఆర్ అభిమానులకి ప్రశాంతత ఉండదు. ఎందుకంటే దేవర సినిమా తర్వాత వార్ -2 లో నటిస్తారా లేదంటే ప్రశాంత నీల్ సినిమానే స్టార్ట్ చేయబోతారా అనేది పెద్ద కన్ఫ్యూజన్. అయితే జనవరి ఆఖరి వారంలో ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతుంది, తారక్ అభిమానులు గుండెల మీద చేయి వేసుకోవచ్చు అంటూ వస్తున్న వార్త ఎంత వరకు నిజమో చూడాలి.