Janhvi Kapoor: దేవర సినిమాకి ఆమె శనిలా దాపురించిందా.. అలా జరిగితే మాత్రం సినిమా డిజాస్టర్ అంటూ?

Janhvi Kapoor: ఎన్టీఆర్, జాన్వి కపూర్ కాంబినేషన్లో 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా కి సంబంధించిన అప్డేట్స్ వస్తున్న ప్రతిసారి సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే దీని గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

ఈ సినిమా అవుట్ పుట్ ఓ రేంజ్ లో రావాలని డైరెక్టర్గా కొరటాల శివ, హీరోగా జూనియర్ ఎన్టీఆర్ శాయ శక్తులా కష్టపడుతున్నారు. అయితే సినిమాలో హీరోయిన్ గా వర్క్ చేస్తున్న జాన్వీ కపూర్ మాత్రం సినిమా గురించి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఫోటోషూట్లు చేసుకుంటుంది. ఫోటో షూట్ లు చేసుకోవడంలో తప్పేముంది అంటే తప్పే..ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు ఆమెని జాన్వీ కపూర్ గా కాకుండా జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ గా మాత్రమే చూస్తున్నారు.

జాన్వీ ఫోటోషూట్ సంగతి అందరికీ తెలిసిందే, ఆమె అందాలని ఆరబోయటంలో ముందుంటుంది. ఈమధ్య లేటెస్ట్ గా వచ్చిన అలాంటి అందాల ఆరబోత ఫోటోషూట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాన్వీ మీద కోపంతో రగిలిపోతున్నారు. ఈ సినిమాకి ఆమె శని లాగా దాపురించింది, ఆ ఫోటో షూట్లేమిటి, ఆమెని సినిమా నుంచి హీరోయిన్ గా తప్పించండి లేదంటే సినిమా అయినంతవరకు ఆ ఫోటో షూట్లు ఆపండి అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు.

అయితే ఎన్టీఆర్, కొరటాల శివ మాత్రం వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ ఈ సినిమా మీద పెడుతున్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అంటున్నారు. హిందీలో సైతం రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండడం గమనార్హం. దేవర పార్ట్ వన్ ని మించి దేవర పార్టు టు ఉండనుందని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఏడాది నందమూరి ఫ్యాన్స్ కి పండగే అంటున్నారు సినీ క్రిటిక్స్. చూడాలి మరి.. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -