Jr NTR: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికి తెలిసిందే. ఎన్టీఆర్ గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. ఇకపోతే తారక్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తరువాత నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దేవర మూవీ టీమ్ హైదరాబాద్ వదిలి గోవాకి పయనమైంది. గోవాలో ఎన్టీఆర్,హీరోయిన్ జాన్వీ కపూర్ పై రొమాంటిక్ సన్నివేశాల చిత్రకరణ చేపట్టారు కొరటాల. గోవా షెడ్యూల్ తర్వాత గోకర్ణ, అలాగే వైజాగ్ లలో నెక్స్ట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసారు. ఇక ఎన్టీఆర్ అటు బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో హ్రితిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోలో బడా మల్టీస్టారర్ గా వార్ 2 చిత్తాన్ని ఎనౌన్స్ చెయ్యడంతో ఇక్కడ ఎన్టీఆర్ ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతుంటే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ మీడియా వరకు వార్ 2 వార్తలని కవర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదగడంతో ఇప్పుడు అతను ఏ ప్రాజెక్ట్ చేసినా దానిపై అందరి దృష్టి పడుతుంది.
అయితే తాజాగా వార్ 2 పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వార్ 2 మూవీ షూటింగ్ మొదలు కావడమే కాదు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా ఫినిష్ అయిందట. ఆయన్ ముఖర్జీ హ్రితిక్ రోషన్ లు స్పెయిన్ లో వార్ 2 కి సంబందించిన ఒక షెడ్యూల్ పూర్తి చేసిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యంగ్ టైగర్ కూడా డిసెంబర్లో వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.