NTR: వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు!

NTR: మాస్ కా దాస్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.అయితే విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.విశ్వక్ సేన్ కోరిక మేరకు ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరయ్యారు.

ఇక దాస్ కా ధమ్కీ సినిమా గురించి, విశ్వక్ సేన్ గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు యంగ్ టైగర్.విశ్వక్ సేన్ లా మాట్లాడినట్లు తాను మైక్ లో మాట్లాడలేనని, విశ్వక్ కాన్ఫిడెన్స్ ఇంపాజిబుల్ అని అన్నారు.తానే బాగా వాగుతానని అలాంటిది తనకంటే ఎక్కువ మాట్లాడతాడని, తానే సైలెంట్ అయిపోయి విశ్వక్ సేన్ మాటలు వినే స్టేజ్ కి తీసుకెళ్లిపోయారని అన్నారు. మూడ్ ఆఫ్ అయినప్పుడు, టెన్షన్ లోకి వెళ్ళినప్పుడు చాలా తక్కువ సినిమాలు చూస్తానని, అలా చూసిన వాటిలో ఈ నగరానికి ఏమైంది సినిమా చూశానని అన్నారు.ఆ సినిమాలో విశ్వక్ ని చూస్తూ ఉండిపోవచ్చునని అన్నారు.ఫలక్ నుమా దాస్ సినిమా చూశానన్నారు.

 

బాగా నచ్చినటువంటి సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా అని అన్నారు.ఇంత యాటిట్యూడ్ కలిగిన విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో యాటిట్యూడ్ పక్కన పెట్టి అమాయకమైన పాత్రలో నటించడం చాలా గొప్ప విషయమని అన్నారు.హిట్ సినిమా చూసి చాలా షాకయ్యానని అన్నారు.చాలా బ్యాలెన్స్డ్ గా నటించాడని, అంత బ్యాలెన్స్డ్ గా నటించడం చాలా కష్టమని అన్నారు.తనకు తానుగా నిరూపించుకోవాలని ఇండస్ట్రీకి వచ్చిన హీరో అని అన్నారు.దాస్ కా ధమ్కీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలన్నారు. ఇదే సందర్భంలో విశ్వక్ సినిమాలు దర్శకత్వం చేయడం ఆపేయాలని సంచలన కామెంట్స్ చేశారు.

 

దయచేసి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసి డైరెక్షన్ ఆపేయ్ అని, ఎందుకంటే చాలా మంది యువ దర్శకులు ఉన్నారని, వారికి నటులే అవకాశాలు ఇవ్వాలని అన్నారు.కొత్త దర్శకులకు విశ్వక్ లాంటి వాళ్ళే అవకాశాలు ఇవ్వాలని, తాము కూడా ఆ కొత్త దర్శకులతో సినిమాలు చేయగలగాలని, కాబట్టి సినిమాలు దర్శకత్వం మానేసి నటుడిగానే కొనసాగు అంటూ విశ్వక్ ని తారక్ కోరారు.తెలుగు సినిమా టాప్ లో ఉంది.అది పడిపోకూడదు.మనందరం కలిసి కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి, తెలుగు సినిమాని ప్రపంచ పటం నుంచి పడిపోకుండా నిలబెట్టాలి అని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -