Director: కాంతార, పుష్ప బాలీవుడ్‌ను నాశనం చేశాయి.. బాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Director: కాంతార సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాచీన విద్య, సంప్రదాయాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదలవ్వగా.. అన్ని భాషల ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి భారీ కలెక్షన్లను మూటకట్టుకుంది.

 

ఇటీవల ఓటీటీలో కూడా ఈ సినిమా విడుదలై అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంటోంది. అయితే తాజాగా కాంతార సినిమాపై బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంతార సినిమా బాలీవుడ్‌ను నాశనం చేసిందంటూ వ్యాఖ్యానించారు. కాంతారతో పాటు పుష్ప సినిమా కూడా బాలీవుడ్ ను నాశనం చేసిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వేదికగా కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్యప్ ల మధ్య ట్విట్టర్‌లో పెద్ద యుద్దమే నడుస్తోంది. ఇద్దరు ఒకరిపై ఒకరు వరుస పెట్టి ట్వీట్ లు చేసుకుంటున్నారు.

 

అనురాగ్ కశ్యప్ ఇంటర్వ్యూను ట్విట్టర్‌లో షేర్ చేసిన వివేక్ అగ్నిహోత్రి.. కశ్యప్ అభిప్రాయాలతో తాను ఏకీభవించనంటూ కామెంట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన అనురాగ్ కశ్యప్.. మీ సినిమాల పరిశోధనలా నా వ్యాఖ్యలపై మీరు చేసిన ట్వీట్లు ఉన్నాయి.. కాస్త రీసెర్చ్ చేయండి అంటూ సెటైర్లు వేశారు. దీనికి వివేక్ సమాధానమిస్తూ.. కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం తాను 4 ఏళ్లు రీసెర్చ్ చేశాననేది అబద్దమని, దమ్ముంటే అది నిరూపించండి అంటూ ఛాలెంజ్ చేశాడు.

 

హిందూవులు చనిపోలేదని నిరూపించాలని, పండితుల వీడియోలు అబద్దమని నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. నిరూపిస్తే తాను ఇంకోసారి తప్పు చేయను అంటూ అనురాగ్ కశ్యప్ కు వివేక్ అగ్రిహోత్రి సవాల్ విసిరారు. దీంతో వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోన్నాయి. ఇద్దరూ వరుస పెట్టి ఒకరిని ఉద్దేశించి ఒకరు చేసుకుంటున్న ట్వీట్లు బాలీవుడ్ లో చిచ్చు రేపుతోన్నాయి. వీరిద్దరి ట్వీట్లపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. కొంతమంది కశ్యప్‌కు, మరికొంతమంది నెటిజన్లు వివేక్ అగ్నిహోత్రికి మద్దతు ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -