Director: సినీ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు సముద్రఖని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమాకు దర్శకత్వం వహించారు.ఇలా దర్శకుడిగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సముద్రఖని ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
ఇలా పలు సినిమాలలో నటుడిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా నటుడు రామ్ చరణ్ గురించి అలాగే అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ తో కలిసి తాను RRRసినిమాలో నటించాను ఈ సినిమాలో చరణ్ నన్ను బాబాయి బాబాయి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. ఈ సినిమా సమయంలోనే మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని తెలిపారు.
ఇక రాంచరణ్ కు క్లిన్ కారా పుట్టినప్పుడు కూడా తనకు మెసేజ్ చేశానని తెలిపారు. ఇక రామ్ చరణ్ తో కలిసి తాను గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నానని సముద్రఖని వెల్లడించారు.చరణ్ ఎంతో మంచి వారని ఆయనకు ఏ కష్టం రాకూడదని ప్రార్థించే వారిలో తాను కూడా ఒకరిని సముద్రఖని వెల్లడించారు.తనని నేను ఒక సొంత కొడుకుల భావిస్తానని ఈయన తెలిపారు. అదే విధంగా అల్లు అర్జున్ గురించి కూడా మాట్లాడారు.
అల్లు అర్జున్ తో కలిసి అలా వైకుంఠపురం సినిమాలో నటించాను నేను అల్లు అర్జున్ అన్బు అర్జున్ అని పిలుస్తాను. అన్బు అంటే ప్రేమ అని అర్థం ఈయన షూటింగ్ లొకేషన్లో అందరితోనూ చాలా ప్రేమగా ఉంటారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారంటూ అల్లు అర్జున్ గురించి కూడా సముద్రఖని ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.