Kantara: ‘కాంతార’ బిగ్గెస్ట్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం డైరెక్టర్ రిషబ్ శెట్టిపై ఫోకస్ పెట్టింది. కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోతోపాటు స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు. కాంతార సినిమా తర్వాత రిషబ్ శెట్టి ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ సినిమాకు నేషనల్ వైడ్ క్రేజ్ పెరగడంతో.. దీని సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా రిషబ్ శెట్టి కాంతార-2 సినిమా పని స్టార్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు దిగంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాంతార సీక్వెల్పై కీలక అప్డేట్ ఇచ్చాడు. కాంతార-2లో హీరో కొడుకు పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నాడని, ఈ పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుందని సమాచారం. కాంతార-2 సినిమా పనులు ప్రారంభమైనట్లు తెలవడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, వరల్డ్ వైడ్ కాంతార సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వచ్చింది. బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీలో రూ.75 కోట్లు, తెలుగులో రూ.50 కోట్లపైగా వసూళ్లు రాబట్టి.. మౌత్ టాక్తో దూసుకెళ్లింది. అలాగే మరోవైపు కాంతార సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అయింది. నవంబర్ 24న అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఓటీటీలో కూడా విపరీతమైన రెస్పాన్స్ ను అందుకుంది. కాంతార సినిమాలో రిషబ్ శెట్టి.. హీరోగా, డైరెక్టర్గా పని చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్గా సప్తమి గౌడ నటించారు. ఈ సినిమా కేవలం రూ.16 కోట్ల బడ్జెట్తో తీయగా.. వరల్డ్ వైడ్ రూ.400.90 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో కర్ణాటక తుళునాడు సంస్కృతి, భూతకోల సంప్రదాయాన్ని డైరెక్టర్ రిషబ్ శెట్టి కన్నులకు కట్టినట్లు చూపించాడు. అలాగే పార్ట్-2పై హైప్ని క్రియేట్ చేశాడు.