Nizamabad: ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు.. కానీ ఆ ఒక్క కారణంతో?

Nizamabad: ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రేమ పేరుతో దారుణంగా మోసపోతున్నారు. ప్రేమించిన వ్యక్తి దారుణంగా మోసం చేయడంతో ఆ దారుణాన్ని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు తీరని షోకాన్ని మిగులుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అలా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చాలామంది ప్రేమ పేరుతో అవసరాన్ని తీర్చుకొని చివరకు మొహం చాటేస్తున్నారు. కొందరు స్వార్థపరులు ప్రేమ పేరుతో దగ్గరయ్యి.. శారీరంగా వాడుకుని ఆఖరికి పెళ్లికి నో చెప్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

ఏడేళ్లు ప్రేమ పేరుతో కలిసి తిరిగారు. తీరా పెళ్లి చేసుకోమంటే అందుకు నిరాకరించాడు ప్రియుడు దాంతో ఆ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే.. నిజమాబాద్‌, నవీపేట మండల కేంద్రానికి చెందిన హరిణి 25 ఏళ్ళ యువతి అదే గ్రామానికి చెందిన అక్తర్‌ అనే యువకుడిని ప్రేమించింది. ఏడేళ్ల క్రితం వీరి మధ్య ప్రేమ చిగురించగా అప్పటి నుంచి చెట్టాపట్టాలేసుకొని తిరాగారు. అయితే ఇటీవల కాలంలో హరిణి పెళ్లి విషయమై అక్తర్‌ పై ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ అక్తర్‌ మాత్రం పెళ్లి ప్రస్తావన రాగానే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాడు.

 

అతడి ప్రవర్తనతో విసిగిపోయిన హరిణి రెండ్రోజుల క్రితం పెళ్లి గురించి అక్తర్‌ను గట్టిగా నిలదీసింది. అతడు హరిణిని పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పాడు. అక్తర్‌ మాటలకు హరిణి మనసు ముక్కలయ్యింది. ఏడేళ్ల పాటు ప్రాణంగా ప్రేమిస్తే ఇప్పుడు తనను కాదనడాన్ని హరిణి జీర్ణించుకోలేకపోయింది. ప్రేమ విఫలం అయిన తర్వాత తాను బతికుండి వ్యర్థం అని భావించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గది తలుపులు పెట్టి ఉండటాన్ని గమనించారు. ఎంత పిలిచినా హరిణి పలకకపోవటంతో వారిలో భయం మొదలయ్యింది. వెంటనే గది తలుపులు పగులగొట్టారు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కుప్ప కూలిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ఫ్యాన్‌కు వేలాడుతుండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఇక హరిణి తండ్రి పిర్యాదు ఫిర్యాదు మేరకు నవీపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -