Nizamabad: ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న మహిళ.. 3ఏళ్ళ కూతురు ఏడవడంతో?

Nizamabad: ఇటీవల కాలంలో పురుషులతో పోల్చుకుంటే చాలామంది మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి చేజేతులా సంసారాల నాశనం చేసుకోవడంతో పాటు జీవితాలను కూడా చేసుకుంటున్నారు. చాలామంది మహిళలు వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని భర్తను పిల్లలను చంపడానికి కూడా వెనకడవడం లేదు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. శారీరక సుఖం కోసం ఒక మనిషిని చాలా సునాయాసంగా చంపగలుగుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తాజాగా నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో దేవుళ్ల సంజీవ్ అనే 27 ఏళ్ల యవకుడు నివసిస్తున్నాడు. అతను స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే సంజీవ్ కి రజిత అనే మహిళ పరిచయం ఏర్పడింది. రజిత కు పెళ్లై 3 ఏళ్ల కూతురు కూడా ఉంది. కానీ ఆమెకు తన భర్తతో విభేదాలు రావడంతో అప్పటినుంచి ఒంటరిగా నివసిస్తోంది. రజిత కు సంజీవ్ తో పరిచయం ఏర్పడడంతో ఇద్దరి మధ్య ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక రెచ్చిపోయిన సంజీవ్ ఏకంగా ప్రియురాలితో పాటు తన ఇంట్లోనే కాపురం పెట్టాడు.

 

ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక రోజు రాత్రి సంజీవ్, రజిత ఇద్దరూ కూడా మద్యాన్ని సేవించారు. మోతాదుకు మించి ఇద్దరు మద్యం సేవించారు. అర్ధరాత్రి కూతురు నిద్రలేచి ఆకలి కోసం ఏడవడం మొదలు పెట్టింది. ఇక ఆ చిన్నారి అరుపులకు నిద్రలేచిన సంజీవ్ దారుణానికి ఒడిగట్టాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడం, రాత్రిపూట రోజూ ఏడుస్తుండడంతో సంజీవ్ ప్రియురాలి సహాయంతో ఆ మూడేళ్ల పసికందు చిన్నారి గొంతు పిసికి హత్య చేశాడు. ప్రియుడు చేస్తున్న పనిని వద్దు అని చెప్పకపోగా ఆ కసాయి తల్లి కూడా ప్రియుడికి సపోర్ట్ చేస్తూ ఆ చిన్నారి గొంతు నులిమేసింది. అనంతరం ఆ చిన్నారి మృతదేహాన్ని స్థానిక చెరువులో పడేశాడు.

 

అయితే మరుసటి రోజు చిన్నారి కనిపించకపోవడంతో స్థానికులు రజితను ప్రశ్నించారు. అప్పుడు రజిత పొంతన లేని సమాదానాలు చెప్పగా అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంజీవ్ రజితను ప్రశ్నించగా అసలు అంగీకరించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -