Naresh: పవిత్రతో నా రిలేషన్ మహేష్ కు ఇష్టమే.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

Naresh: ఈ మధ్యకాలంలో నాలుగవ పెళ్లి, సహజీవనం అంటూ బాగా ఫేమస్ అయిన జంట నరేష్, పవిత్ర లోకేష్. ఈ జంట మళ్లీ పెళ్లి సినిమాతో మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల నుంచి తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలుమార్లు వార్తల్లో నిలిచారు వీరిద్దరూ.

మొన్నటి వరకు మేము స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చిన వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ఇటీవల ప్రకటించారు. పవిత్రతో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నరేష్ ఫ్యామిలీ పరువు తీస్తున్నారు అంటూ కొందరు వాదించారు. పెళ్లి చేసుకోకుండానే ఇలా చెట్టా పట్టాలేసుకుని తిరగడం ఏమీ బాగోలేదు అంటూ కొందరు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

అయితే వారిలా కలిసి ఉండడం కృష్ణ కుటుంబ సభ్యులకు ఓకేనా.. వాళ్ళ నిర్ణయం ఏంటి అంటూ చాలా ప్రశ్నలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. అయితే మళ్లీ పెళ్లి ప్రమోషన్స్ సందర్భంగా నరేష్ ఇస్తున్న ఇంటర్వ్యూలలో తాజాగా ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాడు.

 

తాను పవిత్ర లోకేష్ కలిసి ఉండటం తన సోదరుడు మహేష్, తండ్రి కృష్ణకు కూడా తెలుసని.. వారు తమ బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు నరేష్. నరేష్ కృష్ణ విజయనిర్మల తామంతా ఒకే కుటుంబమని.. ఒక మాట మీదే నిలబడతామని చెప్పుకొచ్చారు. పవిత్ర లోకేష్ మాట్లాడుతూ తనకు తెలుగు రాకపోతే కృష్ణ గారు తనతో ఇంగ్లీషులో మాట్లాడే వారని చెప్పటం కొసమెరుపు.

 

పవిత్ర చేసిన ఫుడ్ కృష్ణ గారు ఎంతో ఇష్టంగా తినేవారని తమ కుటుంబం మొత్తానికి పవిత్ర ఫుడ్ ప్రిపేర్ చేయగలరని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు నరేష్. తమ కుటుంబంలోని వ్యక్తులందరూ మా రిలేషన్ ని అంగీకరించినందుకు చాలా ఆనందంగా ఉన్నట్లు నరేష్ స్పష్టం చేశారు. మరి వీరి రిలేషన్ పెళ్లి వరకు వెళుతుందో లేదో అనేది కాలమే నిర్ణయించాలి.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -