Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అభ్యర్థులు ఎక్కడికి వెళ్లిన వారికి ప్రజల నుంచి చేదు అనుభవమే ఎదురవుతుంది.
తాజాగా ఓ మహిళ కార్యకర్త నా జీవితాన్ని నాశనం చేసావు అంటూ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్రకిషోర్ రెడ్డి సతీమణి నాగిని రెడ్డిని నిలదీసిన ఘటన చోటుచేసుకుంది. నంద్యాల పట్టణం నూనెపల్లిలో ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రెడ్డికి ఓ మహిళ నుంచి ఊహించని షాక్ ఎదురైంది.
ఓట్లు అడగడం కోసం ప్రతి ఇంటికి వెళ్లినటువంటి నాగిని రెడ్డిని ఓ మహిళ నా జీవితం ఇలా సర్వనాశనం కావడానికి నువ్వు నీ కుటుంబమే కారణం అంటూ ఆమెను అందరి ముందు నిలదీశారు. ఇలా ఆమె తనని నిలదీయడంతో వైసిపి నేతలు తనని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె మాత్రం అందరిని తోసుకొని ముందుకు కదలడంతో చేసేదేమీ లేక నాగిని రెడ్డి ప్రచారం మధ్యలోని ఆపివేసి కారులో తిరిగి వెళ్ళిపోయారు.
అయితే తన కుటుంబానికి సంబంధించిన సమస్యల కారణంగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తన కుటుంబానికి పంచాయతీ చేశారని అయితే ఈ పంచాయతీలో తనకు అన్యాయం జరగడంతోనే ఆ మహిళ ఇలా నిలదీస్తుందంటూ స్థానికులు వెల్లడించారు. అయితే నంద్యాలలో మాత్రమే కాకుండా ఎక్కడికి వెళ్లినా కూడా వైసిపి నేతలకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతూ ఉన్నాయి.