Naga Chaitanya-Samantha: చైసామ్ విడిపోవడం వెనుక ఆ హీరోయిన్ ఉందా?

Naga Chaitanya-Samantha: అక్కినేని నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ క్రమంలో అతనిపై అనేక రూమర్లు వ్యాప్తి చెందాయి. ఇటీవల నటి శోభిత ధూళిపాళ్లతో డేటింగ్‌ చేస్తున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. వారిద్దరి మధ్య ఎఫైర్‌ నడుస్తోందని పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే, ఈ వార్తలను నాగచైతన్య టీమ్‌ ఖండించింది. మరోవైపు ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌ అయ్యింది.

 

ఏదైనా వార్త పుకారు వస్తోందంటే అందులో ఎంతో కొంత నిజం ఉందనుకోవచ్చు. ప్రచారానికి కారణమైన వాటిని విశ్లేషిస్తేగానీ అసలు విషయం బోధపడదు. వంద శాతం పుకార్లు నిజం కాకపోయినా కొన్ని ప్రచారాల్లో నిజం ఉంటుంది. అలాంటి వాదనే ఇప్పుడు తెరపైకి వచ్చింది. హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారన్న వార్త కొంత కాలం కిందట సంచలనం రేపింది. నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి.

 

నాగచైతన్య, శోభిత మధ్య ఎఫైర్ నడుస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. వారిద్దరూ తరచుగా టూర్స్, వెకేషన్లకు వెళ్తున్నారని కూడా జోరుగా ప్రచారం సాగింది. నాగ చైతన్య కొత్తగా కట్టుకుంటున్న ఇంటికి కూడా శోభితను తీసుకెళ్లాడని పుకార్లు హల్‌ చల్‌ చేశాయి. సమంతతో విడిపోయాక శోభితను మనువాడాలని నాగ చైతన్య డిసైడ్‌ అయ్యాడంటూ గాసిప్స్‌ వచ్చాయి.

 

అవన్నీ నిరాధార ఆరోపణలే..
అయితే, శోభితతో డేటింగ్‌, రిలేషన్‌షిప్‌ వార్తలన్నీ పుకార్లని, అవన్నీ నిరాధార ఆరోపణలంటూ ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించింది. ఎవరో కావాలని చేస్తున్న ప్రచారం అని స్పష్టత ఇచ్చింది. శోభిత సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేశారు. ఈ ప్రచారంపై సమంత కూడా స్పందించారు. అమ్మాయి మీద ప్రచారం జరిగితే నిజం… అదే అబ్బాయిపై పుకార్లు చెలరేగితే… ఆ ప్రచారం వెనుక ఒక అమ్మాయి ఉందంటారా? అంటూ సమంత ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించింది. నాగచైతన్య, శోభిత డేటింగ్‌ వార్తలకు కారణమైన ఓ ఫొటోను నిశితంగా పరిశీలించిన కొందరు.. అది మార్ఫింగ్ ఫోటో అని చెబుతున్నారు. వేర్వేరు సందర్భాల్లో దిగిన ఇరువురి ఫోటోలను మార్ఫింగ్‌ చేశారని స్పష్టం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -