Namitha: నా పిల్లలకు మీ ఆశీర్వాదం కావాలి: నమిత

Namitha: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలు ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలను తెలియజేయడమే కాకుండా వాటికి సంబంధించిన ఫోటోలను కూడా పెద్ద ఎత్తున అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా నటి నమిత సైతం జన్మాష్టమి సందర్భంగా అభిమానులకు శుభవార్త చెప్పారు.

గతంలో ఈమె తన పుట్టినరోజు సందర్భంగా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇలా నమిత ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఒక్కసారిగా తనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక ఈమె ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి తరచూ తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. అలాగే తన సీమంతం ఫోటోలను, బేబీ బంప్ ఫోటోషూట్ కి సంబంధించిన వీడియో ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఇలా తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించిన నమిత తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తనకు కవల మగ పిల్లలు జన్మించారనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఈ సందర్భంగా నమిత ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ శుభవార్త మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల మాకు కవల మగ పిల్లలు జన్మించారు. వారికి మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకున్నారు.

ఇక డెలివరీ సమయంలో తనని హాస్పిటల్ లో చాలా బాగా చూసుకున్న హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే డాక్టర్ భువనేశ్వరీ, డా.ఈశ్వర్, డా. వెళ్లు మురుగన్ లకు చాలా థ్యాక్స్ హ్యాపీ జన్మాష్టమి అంటూ ఈమె తనకు కవలలు జన్మించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక ఈమెకు పండంటి మగ కవల పిల్లలు జన్మించారనే విషయం తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -