Nara Bhuvaneswari: ఇటీవల మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నిజం గెలవాలి అనే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్తూరులో పర్యటించినటువంటి నారా భువనేశ్వరి మా ఆయనకు రెస్టు ఇవ్వాలని అనుకుంటున్నారు మరి మీరు నన్ను గెలిపిస్తారా అంటూ ఈమె మాట్లాడటంతో సదరు మహిళల ఇద్దరినీ గెలిపించుకునే బాధ్యత మాది అంటూ కామెంట్ చేశారు.
ఇలా ఈమె చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ తనుకు రెస్ట్ ఇవ్వాలని మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలను వైసిపి నాయకులు మరో ఉద్దేశంతో మాట్లాడారు. కొడాలి నాని మాట్లాడుతూ సాక్షాత్తు నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడుకి రెస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అంటే ఆమె ఉద్దేశం ఏంటో అందరికీ అర్థమవుతుంది. అయనని రాజకీయాల నుంచి పూర్తిగా తప్పించాలనే ఉద్దేశంతో మాట్లాడారు అంటూ వ్యాఖ్యానించారు.
ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో నిర్వహించిన సభలో ఇదే విషయాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారు. చంద్రబాబుకు రెస్టు కావాలని ఆయన భార్యే కోరుకుంటున్నారు.. అని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా.. ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుతున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యల పై నారా భువనేశ్వరి స్పందించారు.
చిత్తూరులో పర్యటించినటువంటి ఈమె ఈ విషయం గురించి మాట్లాడుతూ నేను నోరు విప్పితే తప్పుపడుతున్నారు. ఏం మాట్లాడాలి. ఏం మాట్లాడినా కూడా రాజకీయం చేస్తారా? ఇదేం పద్ధతి. మాజీ సీఎం భార్యకు మాట్లాడే హక్కులేదా? ప్రతి విషయాన్నీ.. తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వైసీపీ నాయకులకు ప్రజలు వచ్చే ఎన్నికలలో వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఈమె ప్రజలను కోరారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు నా భర్త గురించి నేను మాట్లాడితే ఆ వ్యాఖ్యలను ఇలా తప్పుగా ప్రచారం చేస్తారా అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు.