Nidhi Agarwal: అందాల తార నిధి అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. 2017లో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన ‘మున్నా మైఖేల్’ సినిమాతో నిధి అగర్వాల్ సినీరంగంలో ప్రవేశించింది. టాలీవుడ్లో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి గుర్తింపును, క్రేజ్ను సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో ‘మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్’ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు హీరోలు, డైరెక్టర్లకు పేరు తెచ్చినా.. నిధి అగర్వాల్కు మాత్రం క్రేజ్ తెప్పించలేకపోయాయి. నిధికి తెలుగులో అవకాశాలు రావడం తగ్గాయి. దీంతో ఇతర భాషా చిత్రాలపై ఫోకస్ పెట్టింది. తమిళంలో శింబుతో చేసిన ‘ఈశ్వరన్’ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు. అయితే హీరో రవి సరసన నటించిన ‘భూమి’ సినిమా సక్సెస్ అయినప్పటికీ.. ఆ సినిమాలో ఓటీటీలో రిలీజ్ కావడంతో నిధికి పెద్దగా పేరు రాలేదు.
కాగా, ప్రస్తుతం నిధి చేతిలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా మాత్రమే ఉంది. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల.. ఇప్పట్లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఉదయ నిధి స్టాలిన్తో జోడిగా ‘కలగ తలైవన్’ సినిమాపైనే నిధి అగర్వాల్ ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో స్టార్ ఇమేజ్ను దక్కించుకునేందుకు నిధి పడరాని పాట్లు పడుతోంది. తాజాగా స్టార్ హీరో ధనుష్తో సినిమా చేసేందుకు పక్కా ప్లాన్ చేస్తోంది. ఆయనతో ఎలాగైన సినిమా చేయాలని నిధి అనుకుంటుందని తెలుస్తోంది. ఒకవేళ ధనుష్తో నటించే అవకాశం వస్తే.. పారితోషికం తీసుకోనని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. అయితే హీరో ధనుష్తో నటించే అవకాశం వస్తుందో? రాదో? వేచి చూడాలి. కాగా, ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.