TDP: ఆ 50 నియోజకవర్గాల ప్రజలు ఏం చేసినా చంద్రబాబును నమ్మట్లేదా?

TDP: వచ్చే ఏడాది ఎలా అయినా విజయం సాధించాలి అని టీడీపీ గట్టిగా ప్రయత్నాలు చేయడంతో పాటు కసిగా కూడా ప్రయత్నిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనుకుంటున్న టీడీపీ కి హ్యాట్రిక్ పరాజయాలు ముంచేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వైనాట్ పులివెందుల అని నినాదించిన పార్టీలో దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌రుస ప‌రాజ‌యాలు వెక్కిరిస్తున్నాయి. వీటిలో కీల‌క‌మైన చిత్తూరు జిల్లా కూడా ఉండ‌డం ఇది పార్టీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌ పై దృష్టి పెట్టాల‌ని ఆలోచిస్తున్నారు.

కాగా గత ఎన్నికల్లో టిడిపి పరాజయం ఫాలవుతున్న నియోజకవర్గాలలో ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే కొనసాజగేలా కనిపిస్తోంది. ఆ నియోజకవర్గాలు ఏవి అన్న విషయానికొస్తే.. రాజాం, పాలకొండ, పాతపట్నం, కురుపాం, సాలూరు, బొబ్బిలి, పాడేరు, రంపచోడవరం, తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, మంగళగిరి, బాపట్ల, గుంటూరు ఈస్ట్, నరసరావుపేట, తుని, జగ్గంపేట, పిఠాపురం, కొత్త­పేట, తాడేపల్లిగూడెం, మాచర్ల వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

 

వీటితోపాటుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, నెల్లూరులోని ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, క‌డ‌ప‌లోని బద్వేలు, జమ్మలమడుగు, మైదుకూరు, క‌ర్నూలులోని నందికొట్కూరు, కోడు­మూరు, ఆళ్లగడ్డ, శ్రీశైలం, రైల్వేకోడూరు, కడప, రాయచోటి, పులివెందుల, కమలా­పురం, కర్నూలు, పాణ్యం, ఆలూరు, చిత్తూరు లోని జి.డి.­నెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు లాంటి నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీకి సెగ పెడుతున్నాయి.

 

కాగా 2009లో ఈ నియోజ‌క‌వ‌ర్గాలలో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకున్న విషయం తెలిసిందే. త‌ర్వాత‌ 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు దక్కింది. దీంతో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం అచ్చెన్నాయుడు చెబుతున్న‌ట్టు 160 స్థానాల్లో అయినా విజ‌యం ద‌క్కించుకోవాలంటే ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌పై టీడీపీ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాలి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు వీటిలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌పై టీడీపీ దృష్టి పెట్ట‌లేదు. అంతే కాకుండా ఆ 50 నియోజకవర్గాల ప్రజలు ఏం చేసినా చంద్రబాబును నమ్మట్లేదా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -