Pawan Kalyan: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. చిరంజీవి జోలికి రావద్దు, చిరంజీవి పద్మవిభూషణ్ గ్రహీత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదంటూ ఘాటుగా హెచ్చరించారు.
చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పంచకర్ల రమేష్, సీఎం రమేష్ ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు తీసుకోవటం మీరు సహించలేకపోతున్నారా.. మిమ్మల్ని కాకుండా ఎవరిని మెచ్చుకున్నా మీరు సహించలేరు. నువ్వు మా అందరి టాక్స్ సొమ్ము తింటున్నావు, ఈమధ్య కేంద్ర ఎన్నికల సంఘం కూడా నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదని చెప్పిందనే విషయాన్ని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్.
సింహం సింగిల్ గా వస్తుంది అనే డైలాగులు సినిమాల్లో బాగుంటాయి అలాంటి డైలాగులు చెప్పినప్పుడు నేనే నవ్వుకుంటాను. జనంతో చప్పట్లు కొట్టించుకోవటానికి చెప్పే డైలాగ్ లు అవి. అలాంటి పెద్ద మాటలు ఇక్కడ మాట్లాడొద్దు. వైసీపీ సింగిల్ సింహం కాదు రేబిస్ సోకిన కుక్క. అలాంటి కుక్కని పట్టుకోవడానికి నాలుగు వైపుల నుంచి వ్యూహం పన్నుతున్నాము.
వైసీపీ ప్రభుత్వం అంటే రేబిస్ సోకిన కుక్క, ఆ కుక్క అన్నింటినీ కాటేస్తోంది అందుకే దాన్ని పట్టుకోవడానికి అందరం కలవక తప్పలేదు అన్నారు. అలాగే నేను వ్యక్తిగత స్వార్థం చూసుకునే వ్యక్తిని అయి ఉంటే ఇవాళ వైసీపీ నీచుల చేత నా భార్యను తిట్టించుకునే వాడిని కాదు. నేను ఎంత ప్రయత్నించినా నా నోటి వెంట భారతి గారు అనే మాట వస్తుంది తప్ప ఆమెను ఒక మాట కూడా అనలేకపోతున్నాను, అది నా సంస్కారం అంటూ సజ్జలకు తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.