Rajamouli: రాజమౌళి ఆల్ టైం ఫేవరెట్ సీన్ అదేనట!

Rajamouli: తెలుగు సినిమా కీర్తిని మరింత వ్యాప్తం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి. సీరియల్స్ స్థాయి నుండి సినిమాల్లోకి వచ్చి, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా హాట్ టాపిక్ అయ్యాడు. బాహుబలి, బాహుబలి2 సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన రాజమౌళి.. తారక్, రామ్ చరణ్ లతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ చేయగా.. అది ఆస్కార్ బరిలో నిలిచింది.

 

దర్శక ధీరుడు దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ నటించిన ‘కొమురం భీముడో’ పాట అందరి మన్ననలు పొందుతోంది. సగటు సినీ ప్రేక్షకుడు ఈ పాటలో ఎన్టీఆర్ నటనను మెచ్చుకోకుండా ఉండలేడు. తారక్ ఆ సీన్ లో నటించడం కాదు.. ఏకంగా జీవించేశాడని అందరూ కితాబుస్తుండటం తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అంతర్జాతీయ మీడియా ముందు వెల్లడించాడు.

 

లాస్ ఏంజిల్స్ లోని డీజీఏ థియేటర్ లో ప్రదర్శనకు జక్కన్న, తారక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్ నటన గురించి జక్కన ప్రశంసల వర్షం కురిపించాడు. తారక్ నటన గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ‘కొమురం భీముడో పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ సాంగ్ లో తారక్ అద్భుతంగా నటించాడు. నేను దర్శకత్వం వహించిన వాటిల్లో ఈ సీన్ నా ఆల్ టైం ఫేవరెట్. తారక్ కనుబొమ్మలపై మీరు కెమెరాను పెడితే వాటితోనూ అతడు హావభావాలను పలికించగలడు’ అని అన్నాడు.

 

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. యంగ్ టైగర్, డైరెక్టర్ కొరటాల శివతో కలిసి ఓ సినిమా చేస్తుండగా.. రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి...
- Advertisement -
- Advertisement -