Writer Alapati Suresh Kumar: జగన్ మోదీకి ఎందుకు మోకరిల్లారు.. ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గరైనా జవాబులు ఉన్నాయా?

Writer Alapati Suresh Kumar: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింహమని చాలా గాంబీర్యం కలవాలని అందరూ చెబుతుంటారు కానీ ఆయనలో ఎంతో అభద్రతాభావం, భయం ఉన్నాయని, ఆయన సింహం కాదు చిట్టెలుక అంటూ విధ్వంసం పుస్తక రచయిత అలపాటి సురేష్ కుమార్ విశ్లేషించారు. ఈయన రచించిన విధ్వంసం పుస్తకంలో ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి ఈయన ఎంతో వివరంగా రాశారు.

ఇందులో భాగంగానే ఈయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సింహం లాంటి వ్యక్తిని తాను సింగిల్ గా పోటీ చేస్తున్నానని అనుకుంటున్నారు కానీ సింహం ఎప్పుడూ సింగిల్ గా ఉండదు. మిగతా సింహాలతో కలిసి జంతువులను వేటాడి చంపుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి వద్దకు ఎవరు వెళ్లకపోవడంతో ఆయన సింహం సింగిల్ అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారని ఈయన వెల్లడించారు.

ఇక జగన్మోహన్ రెడ్డి సింహమే అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఎందుకు మోకరిల్లారని ఈయన విధ్వంసం పుస్తకంలో రాశారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకురాలేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు విమర్శించారు. మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి కీలక బిళ్ళలను దేశం అంత వ్యతిరేకించారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే మద్దతు తెలిపారు. ఆ మద్దతు తెలిపినటువంటి సమయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి మోడీని ప్రత్యేక హోదా ఇవ్వండని ఎందుకు షరతు పెట్టలేదని ప్రశ్నించారు. అయితే జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండటానికి కారణం ఆయనపై ఉన్నటువంటి కేసులే కారణమని తెలిపారు. బయటకు మాత్రమే జగన్ మోహన్ రెడ్డి మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్న ఆయన మాత్రం అభద్రతాభావం లోనే ఉన్నారంటూ ఈ పుస్తకంలో వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -