Ranveer Singh – Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతూ ఇద్దరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 2018 వ సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇలా వివాహం అనంతరం ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి.
వివాహం తర్వాత కూడా దీపిక సినిమాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఇద్దరు సినిమాల పరంగా ఎంతో బిజీగా గడుపుతో ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుని భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.ఇప్పటికే పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఖరీదైన ఆస్తిపాస్తులను కొనుగోలు చేసిన రణబీర్ దంపతులు తాజాగా ముంబైలో మరొక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ జంట ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే తాజాగా అలీ బాగ్ ప్రాంతంలో బీచ్ వ్యూ ఉండేలా రెండున్నర ఎకరాలలో నిర్మించినటువంటి ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఇంటిలో అత్యాధునిక సదుపాయాలతో పాటు ఐదు పడకల గది ఉన్న ఇంటిని ఈ జంట ఏకంగా 22 కోట్ల రూపాయల ఖర్చు చేసే కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ దంపతులు నూతన గృహప్రవేశం చేశారని, ఈ గృహప్రవేశ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను దీపికా పదుకొనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఇంటిని ఈ దంపతులు గెస్ట్ హౌస్ గా ఉపయోగించుకోవాలని భావించారట. ఇక వీరి సినిమాల విషయానికొస్తే పెళ్లికి ముందే ఎన్నో సినిమాలలో నటించిన ఈ జంట పెళ్లయిన తర్వాత 83 అనే సినిమాలో మాత్రమే నటించారు. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రభాస్ సరసన ప్రాజెక్టు కే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.