Allu Arjun: బన్నీకి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆమె ఎంట్రీతో లెక్కలు మారుపోతున్నాయా?

Allu Arjun:  నేషనల్ లెవెల్ లో బెస్ట్ హీరోగా అవార్డు అందుకొని తీస్తున్న ప్రతి సినిమా హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ మంచి ఫామ్ లో ఉన్నాడు మన అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప టు సినిమా షూటింగ్ లో తెగ బిజీగా ఉన్నాడు. పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఆ సినిమాతో ఎన్నో అరుదైన గౌరవాలు అందుకున్నాడు. దాంతో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ డై హార్ట్ ఫ్యాన్స్ అయితే తన తర్వాత సినిమా ఏమిటి అంటూ అప్పుడే ఆరాలు తీయడం ప్రారంభించారు.

అయితే పుష్పా 2 తర్వాత బన్నీ ప్రాజెక్టు గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది.ఈ మూవీ తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించింది. మూవీ టీం సినిమా షూటింగ్ 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వబోతుందని సోషల్ మీడియాలో కూడా న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాకి హీరోయిన్ గా ఒక క్రేజీ బ్యూటీ ని తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి దీపికా పదుకొనె .ఈ సినిమాలో బన్నీకి జంటగా దీపికాని చూపించబోతున్నారు ఈమె ఇండియాకి నెంబర్ వన్ హీరోయిన్ అని తెలిసిందే. అలాంటి హీరోయిన్ ని బన్నీ పక్కన డాన్స్ చేఇస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పూజ హెగ్డే అని తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అఫీషియల్ గా ఖరారు కాలేదు.

అయితే పూజ హెగ్డే అని తీసుకుంటే మాత్రం అలవైకుంఠపురం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటూ ఆనంద పడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ సినిమా గీత ఆర్ట్ బ్యానర్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించబోతుంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే దీపికా హీరోయిన్ అనే విషయాన్ని మూవీ మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -