ఒకప్పుడు మంచి సినిమాలు రూపొందించిన ఈయన ఇప్పుడు కాంట్రవర్సీ సినిమాలను చేస్తూ విమర్శల పాలవుతున్నాడు. ఇక బోల్ట్ బోల్డ్ కామెంట్లు చేస్తూ అందరితో మాటలు పడుతూ ఉంటాడు. అయిన కూడా వాటిని అసలు పట్టించుకోడు. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా నందమూరి వంశం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. చెప్పాలంటే ఆ వంశాన్ని పరువు తీసాడు.
నందమూరి తారక రామారావును చంపిన వాళ్లే ఇప్పుడు రక్తం తుడుచుకొని వచ్చి అభిషేకాలు చేస్తుంటే అంతకంటే పెద్ద జోక్ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగక ఈ సందర్భంగా ఆయన అక్కడ పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
మీకు ఒక సీరియస్ జోక్ చెప్పడానికి వచ్చాను అంటూ.. ఎవరు నవ్వలేని ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంది అని.. అది ఎంత పెద్ద జోక్ అంటే స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావుగారు నవ్వాలో.. ఏడ్వాలో.. తెలియని జోక్ అని.. ఇక్కడ ఇంటి అల్లుడు అయిన వ్యక్తి (చంద్రబాబు) ఎన్టీఆర్ ను దారుణంగా టార్చర్ చేసి ఏడిపించి ఏడిపించి చంపారని.. ఇప్పుడు మళ్లీ ఆయనే దండలు వేయటం జోక్ అంటూ కామెంట్ చేశాడు.
ఇక లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎన్నో సేవలు చేశారు అని.. అయినప్పటికీ చాలామంది ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతి మాయలో పడ్డారంటున్నారు.. అంటే ఆయనకు అవగాహన లేదా అంటూ ప్రశ్నించాడు. అలాంటప్పుడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారు.. రజనీకాంత్ కూడా చంద్రబాబు పక్కన కూర్చొని వాళ్ళని పోవడం అంటే..
ఆయన కూడా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్లే కదా.. ఇక నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ లో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ.. తారకొక్కడే తాత మీదున్న గౌరవంతో వాళ్లతో పాటు వేదిక పంచుకోలేదని.. అందుకే తారక్ కు నేను థాంక్స్ చెబుతున్నాను అంటూ కామెంట్లు చేశాడు. అయితే ఇక్కడ నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ ఒక్కటే మగాడు అనగా అంటే మిగతా వాళ్ళు మగాళ్లు కాదా.. అలా మాట్లాడి ఆ ఫ్యామిలీ పరువు తీస్తున్నావు కదా అని కొందరు అంటున్నారు.