Jayalalitha: ప్రేమించినోడే అడ‌ల్ట్ సీన్స్ చేయించాడు.. వైరల్ అవుతున్న జయలలిత సంచలన వ్యాఖ్యలు!

Jayalalitha: తెలుగు ప్రేక్షకులకు నటి జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉంది. అడపాదడపా సినిమాలలో నటించడంతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తూ మెప్పిస్తోంది జయలలిత. అయితే ఆమె కెరియర్ లో ఎక్కువ శాతం వ్యాపు క్యారెక్టర్లే చేశారు. వాటితో పాటు కొన్ని సీరియ‌స్, కామెడీ రోల్స్‌లోనూ న‌టించారు. ఇప్ప‌టికీ క్యారెక్ట‌ర్ న‌టిగా అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూనే ఉన్నారు జ‌య‌ల‌లిత‌.

మ‌హేష్ బాబు సినిమా భ‌ర‌త్ అనే నేనులో ఆమె అసెంబ్లీ స్పీక‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌డం విశేషం. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న జ‌య‌ల‌లిత త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక ద‌ర్శ‌కుడు నాకు చూపించాడు. అంతేకాకుండా అతడు నాపై యాసిడ్ దాటి కూడా చేయబోయాడు. కానీ నేను తన హింస భ‌రించ‌లేక చాలా ఏళ్ల కింద‌టే అత‌డి నుంచి విడిపోయి ఒంట‌రిగా బ‌త‌క‌డం పెట్టాను అని ఆమె తెలిపింది. నిజానికి నేను ఒక క్లాసికల్ డాన్సర్ ని. తంగా ఇప్పటివరకు దాదాపుగా 1000 కి పైగా ప్రదర్శనలు ఇచ్చాను. అనుకోకుండా సినిమాలలోకి వచ్చాను. అప్పటినుంచి కుటుంబం మొత్తం నామీద ఆధారపడి ఉండేది.

దాంతో ఎటువంటి అవకాశాలు వచ్చినా కూడా కాదనకుండా ఆ పాత్రలు చేసే దాన్ని అని చెప్పుకొచ్చింది జయలలిత. అలాంటి స‌మ‌యంలోనే వినోద్ అనే ద‌ర్శ‌కుడిని ప్రేమించాము. మేమిద్దరం ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నాము. అత‌ను తెర‌కెక్కించిన ఒక సినిమాలో నాతో అడ‌ల్ట్ సీన్లు కూడా చేయించాడు. తనెలాంటి వాడో అర్థ‌మై దూరంగా ఉండాలి అనుకున్నాను. కానీ న‌న్ను పెళ్లి చేసుకోకుంటే చ‌చ్చిపోతాన‌ని బెదిరించాడు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను. త‌ర్వాత నాకు అతను న‌ర‌కం చూపించాడు. పెళ్లైన త‌ర్వాతి రోజే నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. ఆస్తి కోస‌మే న‌న్ను పెళ్లి చేసుకున్నాడ‌ని అర్థ‌మైంది. న‌న్ను గ‌దిలో బంధించాడు. యాసిడ్ పోస్తాన‌న్నాడు. ద‌గ్గ‌రి వాళ్ల సాయంతో అత‌డి చెర నుంచి బ‌య‌టికి వచ్చేసాను అని తెలిపింది జ‌య‌ల‌లిత.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -