Jr NTR-Janhvi Kapoor: జూనియర్ ఎన్టీఆర్‌కి జాన్వీ కపూర్ మేనత్త అవుతుందా.. నమ్మకపోయినా నిజం ఇదేనంటూ?

Jr NTR-Janhvi Kapoor: జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు కూడా జాన్వీ ని ఎప్పుడెప్పుడు తెలుగు తెరమీద చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ఆమె అందాల తార శ్రీదేవి కూతురు కావటమే. దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇలాంటి సమయంలో ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఎన్టీఆర్ కి జాన్వి కపూర్ మేనత్త అవుతుందని ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వారి రిలేషన్ బయటపెట్టారు.

ఎలా ఆమెకి మేనత్త వరస అవుతుంది అంటే అందాల తార శ్రీదేవి అటు నాగేశ్వరరావు, రామారావు దగ్గరనుంచి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వరకు అందరితో నటించింది. అయితే ఒక్క బాలకృష్ణతో మాత్రం నటించలేదు. అందుకు కారణం బాలకృష్ణ స్వయంగా చెప్పారు. శ్రీదేవి తన తండ్రితో రకరకాల పాత్రలలో నటించింది. ఆమె నాకు తల్లితో సమానం ఆమెతో రొమాన్స్ సినిమాలు అంటే నావల్ల కాదు అని చెప్పుకొచ్చారు. అదే పాయింట్ పట్టుకొని ఒక నెటిజన్ బాలకృష్ణకి శ్రీదేవి అయితే ఎన్టీఆర్ కి నానమ్మ వరస అవుతుంది.

నానమ్మ కూతురు జూనియర్ ఎన్టీఆర్ కి మేనత్త కదా అంటూ లాజిక్ గా మాట్లాడాడు నెటిజన్. అంటే జూనియర్ ఎన్టీఆర్ మేనత్తతో జతకట్టాడు అంటూ పెట్టిన ఆ ఫన్నీ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ చూసిన మరొక నెటిజన్ అలా అయితే శ్రీదేవి రామారావుకి మనవరాలు గా కూడా నటించింది అంటూ మరింత ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ప్రేక్షకులకు ఉన్న ఈ సెన్సార్ హ్యూమర్ కి నిజంగా నమస్కారం. ఇలాంటి తెలివితేటలు ఎలా వస్తాయో ఏమిటో అంటూ చాలామంది నవ్వుకుంటున్నారు.

ఆ విషయం పక్కన పెడితే దేవర మూవీ రెండు భాగాలుగా విడుదలవుతున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ మాత్రమే కాదు సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. సముద్రంలోని ఒక దీవిలో జరిగే కథగా, ఆక్టైన్ యాక్షన్ మూవీ గా ఈ సినిమాను కొరటాల తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 5న మనం ముందుకి వస్తున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -