Nirupam Paritala: డాక్టర్ బాబుకు కొత్తిళ్లు అలా వచ్చిందా.. ఏం జరిగిందంటే?

Nirupam Paritala: బుల్లితెరపై వచ్చే సీరియల్ యాక్టర్లలో డాక్టర్ బాబు అంటే తెలియని పేరు ఉండదు. కార్తీకదీపం సీరియల్ లో ఆ క్యారెక్టరు అంత ఇంపార్టెన్స్ ఉంది. నిరుపమ్ కు ఆ క్యారెక్టర్ తో మంచి పేరు వచ్చింది. ఇక బుల్లితెర స్టార్ కపుల్ గా కూడా మంజుల-నిరుపమ్ గురించి తెలియనవారుండరు. కార్తీకదీపం సీరియల్తో టీఆర్పీలు కొల్లగొట్టి బుల్లితెర హీరోగా మారాడు నిరుపమ్.

అటు ఆయన భార్య మంజుల కూడా పలు సీరియల్స్ లో నటనతో అదరగొడుతోంది. వీరిద్దరూ జంటగా పలు టీవీ షోల్లోనూ పాల్గొం టూ మంచిగానే సంపాదిస్తున్నారు. ఈ జోడీతో ఆ షోలలో స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. తాజాగా వీరిద్దరూ తమకు కొత్త ఇళ్లు ఉ‍న్న విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు మంజుల ఆ ఇంటిని అంతా కలియ తిరిగి చూపించింది. ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్ పనులు నడుస్తుండగా అంతా పూర్తవగానే ఈ ఇంటికి షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

 

ఈ సందర్భంగా నిరుపమ్ మాట్లాడారు. ఈ ఇల్లు నాన్న బుక్ చేశారు. సినీ కార్మికుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ ఇల్లు వచ్చింది. నాన్న లేకపోవడంతో అది నాకు ట్రాన్స్ ఫర్ అయింది. అది బుక్ చేసి దాదాపు 18 ఏళ్లు అవుతుంది. ముందు 3 BHK అనుకున్నారు. తర్వాత దాన్ని డూప్లెక్స్ ఫ్లాట్ గా అప్డేట్ చేశారు. అలా అనేక కారణాల వల్ల పని ఆలస్యమవుతూ వచ్చింది. ఇన్నాళ్లకు ఇల్లు పూర్తవడానికి వచ్చిందని చెప్పాడు. ఏదైతేనేమి డాక్టర్ బాబు ఇంట్లోకి చేరబోతున్నారని ఫ్యాన్సు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -