Soumya: సినీరంగంలో తెరపై నవ్వులు పూయించే కొంతమంది కళాకారుల నిజ జీవితంలో అంత ఆనందం ఉండదు. చాలామంది నటులు తమ జీవితంలో విషాదాన్ని పక్కనపెట్టి మన ఆనందం కోసం వారు కష్టపడుతుంటారు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్ట్ షోలో నటించే చాలామంది నటీనటుల జీవితాలు విషాదంతో నిండి ఉంటాయి. ఇప్పుడు ఈ షోకు యాంకర్గా వచ్చిన సౌమ్యారావు జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి.
అనేక సీరియళ్లలో నటించిన సౌమ్యారావు ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్లో పాల్గొని అందరిలో నవ్వులు పూయించింది. ఈమె వచ్చిరాని తెలుగు మాటలు అందర్నీ ఆకర్షించాయి. హైపర్ ఆది, ఆటో రామ్ప్రసాద్ వంటి సినీయర్ కమెడియన్లకు ఈమె ఈషోలో చుక్కలు చూపించి ఔరా అనిపించింది. దీంతో ఒక్కసారిగా ఈమెకు పాపులారిటీ పెరిగింది. దీంతో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్ట్ షోకు యాంకర్గా కూడా ఎంపికైంది. ఈమె వచ్చాక ఆ షోకు కొత్త గ్లామర్ వచ్చింది.
ఇప్పటికే రెండు ఎపిసోడ్లకు యాంకరింగ్ చేసిన ఈ అమ్మడు మూడో ఎపిసోడ్ కోసం రెడీ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ తెరవెనుక జీవితానికి సంబంధించిన ఒక వీడియోక్లిప్ ఇప్పుడు అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఈ వీడియోలో ఆమె తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. తనకు ఎవరూ లేరని తాను ఒక అనాధనని ఆమె బరువెక్కిన గుండెతో తెలపడం అందరి హృదయాలను బరువెక్కిస్తుంది.
ఆ మధ్య ఈమె పాల్గొన్న ఓ షోలో యాంకర్ ప్రదీప్ ఈమె గురించి చెప్పమని అడుగగా నా లైఫ్ గురించి చెప్పడానికి అంతగా ఏమీ లేదని, తనకు అమ్మ ఎవరో తెలియదని, తాను ఒక అనాధనని చెప్పింది. షోలో ఉన్నవారందరికీ అమ్మ, నాన్న, అన్నయ్య అని ఎవరో ఒకరు ఉంటారని కానీ తనకు ఎవరూ లేరని ఆమె వాపోయింది. నాకు మీలాగా ఫ్యామిలీ ఉంటే బాగా చూసుకుంటాను అని భావోద్వేగానికి గురైంది.