Super Star Krishna: ఆ అవసరం కోసమే కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారా?

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఆయన గురించి అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఆయనతో సాన్నిహిత్యం కలిగిన వారు, ఆయనతో కలిసి పనిచేసిన కొంతమంది యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా కృష్ణ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ఇందిరాదేవి ఉండగా.. విజయనిర్మలను కృష్ణ రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారనే దానిపై ఒక విషయం బయటపడింది.

 

కృష్ణను విజయనిర్మల బాగా చూసుకునేదని, ప్రతి విషయంలో ఆయనకు వెన్నుదన్నుగా ఉండేదని చెబుతున్నారు. కృష్ణ ఆరోగ్యం విషయంలో విజయనిర్మల బాగా జాగ్రత్తలు తీసుకునేదని, ఫుడ్ బాగా వండేదని అంటున్నారు. బయట ఫుడ్ అసలు పెట్టేది కాదని, తనే స్వయంగా వండి పెట్టేదని అంటున్నారు. అవుట్ డోర్ షూటింగ్‌లకు వెళ్లినా, విదేశాలకు వెళ్లినా తన వంట సామాగ్రిని విజయనిర్మల వెంట తెచ్చుకునేదని అంటున్నారు. అక్కడ కూడా మంచి వంట చేసి కృష్ణకు పెట్టేవదని చెబుతున్నారు.

 

అమెరికాకు కూడా వంట సామాగ్రి

అందుకే ఇందిరాదేవి ఉన్నా.. విజయనిర్మలను కృష్ణ పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఇందిరాదేవి బయటకు వచ్చేవారు కాదని, విజయనిర్మల అన్ని పనులు చూసుకునేదని అంటున్నారు. విజయనిర్మల, కృష్ణ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవారని, ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని అంటున్నారు. కృష్ణతో కలిసి అమెరికా, ఊటి, కేరళ వెళ్లినప్పుడు అక్కడకి కూడా విజయనిర్మల తన వంట సామాగ్రి తీసుకొచ్చి కృష్ణకు వంటి చేసి పెట్టినట్లు కృష్ణకు మేకప్‌మెన్ గా పలు సినిమాల్లో పనిచేసిన ఓ మేకప్ మెన్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చి ఇంటర్వ్యూలో తెలిపారు.

 

కృష్ణ కోసం విజయనిర్మల ఊటిలో ఒక ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమని చెప్పాడు. ఇందిరాదేవి, విజయనిర్మలకు ఒకేలా కృష్ణ తన ప్రేమను పంచేవాడని చెబుతున్నారు. అలాగే కృష్ణ, ఎన్టీఆర్ కు మధ్య ఉన్న విబేధాలపై కూడా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం సినిమాల విషయంలో వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయని, ఎన్టీఆర్ అంటే కృష్ణకు ఎంతో ఇష్టమని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -