TDP: జగన్ కు చుక్కలు చూపించే మేనిఫెస్టోను టీడీపీ సిద్ధం చేసిందిగా!

TDP: తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడులో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళల కోసం మహా శక్తి కార్యక్రమం చేపడతామని తెలిపారు. అంతేకాకుండా ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు మహిళల ఖాతాల్లో వేస్తామని తెలిపారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామని తెలిపారు. యువత కోసం యువగళం కార్యక్రమం ప్రకటించారు. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు ఇస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రైతన్నల కోసం అన్నదాత కార్యక్రమం తెస్తామని చంద్రబాబు తెలిపారు.

2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంతో మిని మ్యానిఫెస్ట్ ని విడుదల చేశారు. ఇప్పటికే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకేళ్లారు. వీటికి బలం చేకూర్చే విధంగా ఇప్పుడు మిని మ్యానిఫెస్టోని తీసుకుని వచ్చారు. దీనిలో నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు పెద్దపీఠ వేశారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మ్యానిఫెస్టోలో స్థానం కల్పించారు. అంతేకాకుండా మ‌హిళ మహాశక్తి పేరుతో పథకాన్ని తీసుకుని వస్తామని, ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపడుచులకి స్త్రీనిధి కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు.

 

దీనితో పాటే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందించేలా తెలుగుదేశం హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని ఇస్తాము అని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా
ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. మినీ మ్యానిఫెస్ట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు రిచ్ టూ పూర్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం తో పేదలను సంపన్నులను చేసే విధంగా తెలుగు దేశం ప్రభుత్వం ముందడగు వేయనుంది. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా టీడీపీ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

 

వైఎస్సార్సీపీ హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారు. 650 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. రాష్ట్రంలో 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి. వీటిలో దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తోంది. వారికి అన్ని విధాలా అండగా నిలిచేలా ఈ చట్టాన్ని తీసుకుని వస్తోంది. ఇలా వారికి వీరికి అని కాకుండా అందరికీ అన్ని రకాల పథకాలు వర్తించేలా ఒక్కొక్క పథకాలను ప్రవేశపెడతామని తాజాగా మహానాడులో మేనిఫెస్టోలో పేర్కొన్నారు చంద్రబాబు. కాగా మహానాడులో బాబు మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత వచ్చే ఏడాది జగన్ కు ఓటమి తప్పదు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -