Thaman: కన్నీళ్లు పెట్టుకున్న థమన్.. ఆడియన్స్ అలా అనడంతో?

Thaman: కోలివుడ్ స్టార్ హీరో విజయ్న హీరోగా వారిసు అనే సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ విజయ్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తూ తమ ఆనందాన్ని చాటుకుంటున్నారు. వారిసు సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల దగ్గర విజయ్ భారీ కటౌట్లకు ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేస్తున్నారు. థియేటర్‌లో ‘వారిసు’కు వస్తున్న రెస్పాన్స్ చూసి నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎమోషనల్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

‘వారిసు’ దర్శకుడు వంశీ పైడిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత దిల్ రాజు, నటుడు కిక్ శ్యామ్ సహా చిత్ర బృందం మొత్తం చెన్నైలో ఫ్యాన్స్ తో కలిసి ఈ సినిమా చూశారు. ఈ సినిమాను చూసిన అభిమానులు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాని పొగడ్తలతో ముంచెత్తారు. తమతో కలిసి సినిమాను చూసిన ‘వారిసు’ టీమ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికి వారిని ఎంతగానో ప్రశంసించారు.

 

అభిమానుల ఉత్సాహం, అభిమానం చూసి తమన్ అక్కడే ఏడ్చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్ఎస్ థమన్ థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు కూడా భావోద్వేగానికి లోనైన వీడియో ప్రస్తుతం ఫ్యాన్స్ ను ఆకర్షిస్తోంది. ‘వారిసు’ టీమ్‌కి అభిమానులు తమ మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇకపోతే ‘వారిసు’ సినిమాకు ఇప్పటికే ఫ్యాన్స్, క్రిటిక్స్ నుంచి సక్సెస్ టాక్ వచ్చేసింది. ఈ సినిమాకు తమన్ సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయిందని రివ్యూలు కూడా ఇచ్చేశారు. అందువల్లే సినిమాలో ఎమోషన్ సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయని పలువురు అంటున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎమోషన్స్‌ను మిక్స్‌ చేసి ఈ సినిమాను రూపొందించారని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం థమన్ ఏడ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -