Tadepalle: శోభనం వల్ల ప్రాణం కోల్పోయిన పెళ్లికొడుకు.. ఆరోజు ఏమైందంటే?

Tadepalle: కొత్తగా పెళ్లయిన జంట చూడటానికి ఈడు చూడు చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఇలా పెళ్లి తర్వాత ఆ దంపతులకు మొదటి రాత్రిని పెద్దలు ఏర్పాటు చేశారు. అయితే ఫస్ట్ నైట్ అంటే భయపడినటువంటి పెళ్లి కొడుకు ఎవరు ఊహించని విధంగా నిర్ణయం తీసుకొని అందరికీ ఓ షాక్ ఇచ్చారు. ఇలా పెళ్లి కొడుకు తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబీకులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే…

తాడేపల్లిలోని మాచర్ల సాగర్‌ రింగ్‌రోడ్‌ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన పత్తిగుడుపు కిరణ్‌కుమార్‌ అనే యువకుడికి తెనాలి వించిపేటకు చెందిన యువతితో వివాహం జరిగింది. ఇలా కిరణ్ తన భార్యను తీసుకొని మాచర్లకు వెళ్లారు.అయితే వధువు కుటుంబ సభ్యులు ఈ ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాటు చేయడంతో కిరణ్ తన భార్యను తీసుకుని తెనాలికి బయలుదేరారు. అయితే కిరణ్ గుంటూరులో బస్సు దిగి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయారు.

 

ఇలా వస్తానని చెప్పి వెళ్లినటువంటి తన భర్త ఎంతసేపటికి రాకపోయేసరికి ఆ యువతి కంగారుపడి తన అత్తింటి వారికి ఈ విషయాన్ని అందవేసింది. అయితేకుటుంబ సభ్యులందరూ కూడా తమ కుమారుడి కోసం ఎదురుచూశారు. అయినప్పటికీ రాకపోయేసరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

 

ఈ క్రమంలోనే కృష్ణానది ఎగువ ప్రాంతంలో కిరణ్ కుమార్ మృతదేహం ఉందని సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో శవాన్ని బయటకు తీయగా అప్పటికే శవం మొత్తం కుళ్ళిపోయింది. అయితే ఆ శవం కిరణ్ అనే యువకుడిది అని తెలిసి పోలీసుల కుటుంబీకులకు సమాచారం అందజేశారు. అయితే మొదటి రాత్రి అంటే భయపడినటువంటి కిరణ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు నిర్ధారణకు వచ్చారు అయితే కిరణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఇరువురి కుటుంబ సభ్యులలో విషాదం నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -