Chikkanayakanahalli: ప్రియుడిని దూరం పెట్టిన ప్రియురాలు.. చివరికి?

Chikkanayakanahalli: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ప్రేమ పేరుతో జరుగుతున్న ఘోరాలు దారుణాలు పెరిగిపోతున్నాయి. మొదట ప్రేమించమంటూ వెంటపడటం ప్రేమించిన తర్వాత పెళ్లి విషయంలో అభ్యంతరం చెప్పారని,దూరం పెట్టారనిఇలా రకరకాల కారణాలతో యువతులను దారుణంగా చంపేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, దూరం పెట్టిందని దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక రాష్ట్రం చిక్కనాయకనహళ్లిలోని బట్టరహళ్లి గ్రామానికి చెందిన సిద్ధరామయ్యకు బి.ఎస్. వినయ్ కుమార్ అనే 26 కొడుకు ఉన్నాడు. అతడు స్థానికంగా ఉన్న సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఇక మరొకవైపు దొడ్డబిదరె గ్రామానికి చెందిన జీవిత అనే 17 ఏళ్ళ యువతి తన తల్లితో కలిసి వినయ్ ఉండే బట్టరహళ్లిలో నివాసం ఉంటోంది. తుమకూరులో పీయూసీ చదువుతున్న జీవిత ఇటీవలే విడుదలైన ఫలితాల్లో పాసైంది. అయితే గత కొంతకాలం నుంచి వినయ్, జీవిత ప్రేమించుకున్నారు. ఇటీవలే వీరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో జీవిత, వినయ్ ను దూరం పెట్టింది.

 

జీవితతో మాట్లాడటానికి వినయ్ పలుసార్లు ప్రయత్నించాడు. అయినా కూడా అతడితో మాట్లాడేందు జీవిత ససేమిరా అంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న వినయ్ కుమార్ జీవిత ఇంటికి వెళ్లి కత్తితో ఆమె గొంతుపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి అనంతరం వినయ్ కుమార్ కనిపించకుండా పోయాడు. చివరకు గ్రామ శివారులో ఉన్న కోనేరులో వినయ్ మృతదేహం కనిపించింది. అలా ఒక యువ జంట ప్రేమ వ్యవహారం విషాదంగా ముగిసింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -