Mumbai: యువకుడి పై అక్కాచెల్లెలు దారుణం.. చివరికి?

Mumbai: తాజాగా ముంబైలో ఇద్దరు అక్క చెల్లెలు ఒక యువకుడిపై దారుణానికి ఒడిగట్టారు. పెళ్లి చేసుకుంటామని పిలిపించి రెండు కాళ్లు విరగ్గొట్టారు. అసలేం జరిగిందంటే.. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.. ముంబైలోని అంథేరీ ప్రాంతానికి చెందిన జయశ్రీ బైరాగి అనే 23 ఏళ్ల అమ్మాయికి కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడితో పెళ్లి కుదిరింది. రెండు కుటుంబాల వాళ్ల అనుమతితో జనవరి నెలలో వీరి పెళ్లి నిశ్చయం అయింది. కానీ అనుకోని కారణాల వల్ల జయశ్రీ కుటుంబం ఫిబ్రవరి నెలలో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంది. దీంతో జయశ్రీ యువకుడితో మాట్లాడటం మానేసింది. అయితే యువకుడు మాత్రం ఈ పెళ్లి క్యాన్సిల్‌ చేసుకోవటానికి ఇష్టపడలేదు.

తరచుగా జయశ్రీకి ఫోన్లు చేస్తూ ఉన్నాడు. కావాలంటే లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటూ ఆమెను ఇబ్బంది పెట్టసాగాడు. దాంతో జయశ్రీ ఆ యువకుడి వేధింపులు తట్టుకోలేకపోయింది. ఎలా అయిన అతడి అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ విషయాన్ని తన అక్క రీతూకి చెప్పింది. రీతూ తన భర్త, మరో ముగ్గురితో కలిసి యువకుడిని కొట్టడానికి ప్లాన్ వేశారు. అనుకున్న ప్రకారమే వారందరూ కలిసి జయశ్రీతో యువకుడికి ఫోన్‌ చేయించి వాళ్ళు చెప్పిన ప్రదేశానికి రమ్మని ఆమెతో చెప్పించారు. దాంతో జయశ్రీ ఆ యువకుడికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుందాం రమ్మంటూ అతడ్ని ముంబైకి పిలిపించింది.

 

ప్రేమించిన యువతి పెళ్లి అనే సరికి ఆ యువకుడు ఏమాత్రం ఆలోచించకుండా ముంబైకి వచ్చాడు. జయశ్రీ చెప్పిన చోటుకు వెళ్లాడు. అయితే తీరా అక్కడికి వెళ్లిన జయశ్రీ, రీతూ, మిగిలిన ముగ్గురు అతడిపై విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారు. దీంతో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. దాడి తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సహాయంతో యువకుడు ఆసుపత్రిలో చేరాడు. కొంచం కోలుకున్న తర్వాత తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -