Jabalpur: బాలికలతో నగ్నంగా డాన్స్ చేయించిన టీచర్.. చివరికి?

Jabalpur: సమాజంలో చాలామంది ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పించాల్సింది పోయి విద్యార్థులతో తప్పుగా ప్రవర్తించడం విద్యార్థులతో ఇప్పుడు పనులు చేయించడం లాంటివి చేస్తున్నారు. ఇంకొందరు ఉపాధ్యాయులు అయితే విద్యార్థులను వేధిస్తున్నారు. ఇప్పటికే బాలికలను వేధించిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే బాలికలతో అర్థనగ్న డ్యాన్సులు వేయించాడు.

 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రామ్ సింగ్ ఠాకూర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మార్చి 11న 4, 5 వ తరగతి చదువుతున్న కొందరు బాలికలతో తరగతి గదిలో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించాడు. బాలికలకు ఇష్టం లేకపోయినా సరే టీచర్ బలవంతం మీద భయపడి డ్యాన్సులు చేశారు. అయితే పిల్లలు డ్యాన్సులు వేస్తుంటే సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ కర్రతో కొట్టి మరీ బెదిరించాడు. కానీ వారిలో ఒక బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.

 

ఆ తర్వాత మరో బాలిక కూడా టీచర్ చేసిన నిర్వాకాన్ని తన తల్లికి వివరించడంతో వారు గ్రామస్తులకు తెలియజేశారు. టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు టీచర్ గురించి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలికి తెలియజేయగా ఆమె బాలికల తల్లిదండ్రులతో కలిసి సదరు ఉపాధ్యాయుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రామ్ సింగ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే స్కూల్ లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేని సమయంలో బాలికలతో డ్యాన్సులు వేయించడం, అందులోనూ అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించడంపై కారణమేంటో అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -