Prabhas-Trisha: త్రిష బిల్డప్ మామూలుగా లేదుగా..? ప్రభాస్ ఫ్యాన్స్ ను!!

Prabhas-Trisha: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్ త్రిష. అప్పట్లో ఈ భామను వెండి తెరపై చూసేందుకు కుర్రాళ్లు ఎంతో ఆసక్తి కనబర్చేవారు. అప్పుడున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలొయింగ్‌కు త్రిష టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగింది. అలా కొన్నేళ్లపాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగింది. హీరో ప్రభాస్ నటించిన ‘వర్షం’ సినిమాతో త్రిష హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి హిట్ టాక్‌తో దూసుకెళ్లింది.

 

ఈ సినిమాతో ప్రభాస్ కెరీర్ కూడా టర్న్ అయింది. త్రిషకు కూడా వరుస ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు, అభిమానులను సంపాదించుకుంది. కానీ ఉన్నట్లుండి ఆమె కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. దీంతో టాలీవుడ్ అవకాశాలు రావడం తగ్గాయి. దీంతో తమిళం, హిందీ సినిమాల వైపు అడుగులు వేసింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే మిగిలింది.

 

అప్పటినుంచి అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. ఆమె కెరీర్ పూర్తిగా క్లోజ్ అవుతుందని అనుకున్న టైంలోనే త్రిషకు కొన్ని మంచి సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇటీవల మణిరత్నం ‘పీఎస్-1’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో తమిళ్‌లో మంచి హిట్ అందుకున్నా.. తెలుగు ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. అయితే ప్రభాస్ సినీ రంగంలోని అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలో ప్రభాస్-త్రిష జంటగా నటించిన ‘వర్షం’ సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పరిమిత సంఖ్యలోనే షోలు వేసినా.. ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

 

అయితే ఓ షోలో అభిమానులు చేసిన సందడికి సంబంధించిన వీడియోను త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసింది. 18 ఏళ్ల తర్వాత వర్షం సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని, అభిమానుల ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో చెప్పుకొచ్చింది. కానీ వర్షం సినిమా రీ రిలీజ్‌కు ప్లాన్ చేసింది ప్రభాస్ ఫ్యాన్స్. థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ అల్లరి చేస్తుంటే.. అక్కడ ఉన్నవారంతా తన అభిమానులంటూ త్రిష బిల్డప్ కొట్టింది. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వింతగా చూస్తున్నారు. వరల్డ్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ గురించి, చిత్ర బృందం గురించి త్రిష ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై మండిపడుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -