Poonam Pandey: వైరల్ అవుతున్న ఉమైర్ సంధు సంచలన వ్యాఖ్యలు!

Poonam Pandey: పూనం పాండే తన 32 ఏళ్ళ వయసులో గర్భాశయ క్యాన్సర్ తో మరణించిందని ఆమె మేనేజర్ ధ్రువీకరించారు. దీంతో అభిమానులు అందరూ విషాదంలో మునిగిపోయారు. అయితే ఫ్యాషన్ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు పూనం బతికే ఉందని ఆమె మరణ వార్తను ఆమె ఆనందిస్తున్నారని చెప్పారు. తాను పూనమ్ కజిన్ తో మాట్లాడానని ఇది పూనం పబ్లిసిటీ స్టంట్ అని ఉమైర్ ట్వీట్ లో పేర్కొన్నాడు. క్యాన్సర్ ద్వారా పూనమ్ పాండే చనిపోయిందని నిన్నటి నుంచి వార్తలు వినిపించాయి.

 

దీనిని ప్రతి ఒక్కరూ నిజం అనుకుని నమ్మారు. ఇది అబద్ధమని ఉమైర్ సందు చెప్తూనే వచ్చారు. అయితే ఇదంతా నిజంగానే అబద్ధమని తాజాగా పూనం ఒక వీడియోని షేర్ చేసింది. ఇదంతా గర్భసయ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ కోసమే చేశాను అంటూ తెలిపింది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈమె చనిపోయినట్లు నిన్న ఈమె కుటుంబ సభ్యులు ఒక పోస్టర్ ని షేర్ చేశారు. ఇక ఈరోజు ఏమో మరొక వీడియోతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి నేను చనిపోలేదు అంటుంది.

దీంతో ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చింది మీకు ఇదంతా సరదాగా ఉందా, నిజంగా చనిపోయావని అందరూ అనుకున్నారు మీరు ఏదైనా యాడ్ కి ప్రమోట్ చేయాలన్నా,ఆ వ్యాధి గురించి తెలపాలన్నా వివరించండి అంతేకానీ ఇటువంటి సిల్లీ డ్రామాలు వేయకండి అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం పూనమ్ పాండేకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇదంతా నటి నషా చేసినట్లు వెల్లడించింది.

 

అయితే ఈ వార్తపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి తన స్పందనని తెలియజేశారు. ఈ సమస్యపై అందరి దృష్టిని మరల్చటానికి మీరు ఎంచుకున్న విపరీతమైన పద్ధతి కొంత విమర్శలకు దారి తీయవచ్చు కానీ మీ ఉద్దేశాన్ని ఎవరు ప్రశ్నించలేరు. సర్వైకల్ క్యాన్సర్ పై చర్చ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. మీరు సంతోషమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్లో వ్రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ చూసిన ప్రేక్షకులు ఇద్దరికీ భలే సరిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -