Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్నటువంటి పేరు.యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే పలు సినిమాలలో హీరోలకు చెల్లెలు పాత్రలో నటిస్తూ కొనసాగుతున్నటువంటి వైష్ణవి చైతన్య నటన చూసి సాయి రాజేష్ తనకు హీరోయిన్గా అవకాశం కల్పించారు.
ఇలా సాయి రాజేష్ దర్శకత్వంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం బేబీ. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య స్వస్థలం హైదరాబాద్ కావడం విశేషం.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వైష్ణవి చైతన్య పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు ఉన్నటువంటి కోరికలను కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు.తాను ఓల్డ్ సిటీలో నివసించేదాన్ని అయితే ఆడిషన్స్ కోసం రావాలి అంటే తన తండ్రితో పాటు బైక్ పై వచ్చేదాన్ని ఆ దారిలో పెద్ద పెద్ద బిల్డింగ్స్,మాల్స్ చూసి ఎప్పటికైనా నేను ఇలాంటి చోట ఒక ఇల్లు కట్టుకొని ఉండాలన్నదే తన కోరిక అని తెలిపారు.
ఇక వచ్చే దారిలో ఇన్ ఆర్బిట్ మాల్ చూసి ఒక్కసారైనా ఈ మాల్ కివెళ్లి చిన్న వస్తువునైనా కొనుగోలు చేయాలి అనుకునేదాన్ని ఒకవేళ షాపింగ్ చేయకపోయినా ఈ మాల్ మొత్తం తిరిగి చూసి రావాలన్నదే తన కోరిక అంటూ ఈమె తెలిపారు. అయితే ప్రస్తుతం బేబీ సినిమా మంచి హిట్ కావడంతో ఈమె కన్న కలలన్నింటినీ కూడా నెరవేర్చుకున్నారని తెలుస్తుంది.ఇలా హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో వైష్ణవి చైతన్యకు సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.